Pakistani : హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్థానీ యువకుడు
- భారత ప్రభుత్వ కఠిన నిర్ణయాలు
- పాక్ పౌరులకు వీసాల రద్దు
- హైదరాబాద్లో మహమ్మద్ ఫయాజ్ అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani : పహల్గామ్లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు రేపింది. ఈ దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాకిస్తాన్ పౌరుల విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే కేంద్రం పాక్ పౌరులకు ఇచ్చిన వీసాలను రద్దు చేసింది. అంతేకాకుండా, భారత్లో ఉన్న పాక్ పౌరులకు దేశం విడిచి వెళ్లాలంటూ స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ నిబంధనల మేరకు అన్ని రాష్ట్రాల్లో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణలోనూ పోలీసు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేశారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్లో నిర్వహించిన తనిఖీల్లో పాకిస్తాన్కు చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మహమ్మద్ ఫయాజ్గా గుర్తించబడ్డాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఫయాజ్ గతంలో దుబాయ్లో ఉద్యోగం చేస్తూ జీవించేవాడని, ఇటీవల హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడని తేలింది. తన భార్యను కలిసేందుకు పాకిస్తాన్ నుంచి నేరుగా రావడం కష్టమని భావించి, నేపాల్ మీదుగా భారత్లోకి ప్రవేశించి చివరకు హైదరాబాద్కు చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
- Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
మహమ్మద్ ఫయాజ్ ఈ విధంగా ఎలా భారత్లోకి ప్రవేశించాడు? అతడికి సహాయం చేసిన ఇతర వ్యక్తులు ఉన్నారా? అతడి రాక వెనుక ఇతర ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు ఇప్పుడు లోతుగా విచారణ చేస్తున్నారు. ఫయాజ్ ప్రయాణ వివరాలు, వీసా సమాచారం, నేపాల్ నుంచి వచ్చిన దారులు, అతడి ఇతర సంబంధాలపై అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత, అతడిని పాకిస్తాన్కు డిపోర్ట్ చేసే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటన మరోసారి పాకిస్తాన్ పౌరులపై కేంద్ర ప్రభుత్వం why తమ నిఘాను బలపరుస్తున్నట్లు స్పష్టంగా చూపిస్తోంది. భద్రతా పరంగా ఏ విషయానికీ రాజీపడకుండా, ప్రతి చిన్న వివరాన్ని పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటున్న అధికారులు, ప్రజల భద్రతకే ప్రాముఖ్యత ఇస్తున్నారని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..