Pakistan: పాక్ వైమానిక దాడులు.. 8 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పొరుగు దేశంపై పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడికి పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకొంది. ఆఫ్ఘనిస్తాన్లో రెండు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.ఆఫ్ఘనిస్తాన్ ముష్కరులకు ఆశ్రయం కల్పిస్తుందన్న సాకుతో పాకిస్థాన్ వైమానికి దాడులకు తెగబడింది. రెండు ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ రెండు దాడుల్లో ముగ్గురు పిల్లలు సహా ఐదుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ చర్యను ఆప్ఘనిస్తాన్ ప్రతినిధి ఖండించారు. ఈ చర్య తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించిందని పేర్కొన్నారు. పాకిస్థాన్ స్వదేశంలో ఉగ్రవాదాన్ని అణచివేయలేక మమ్మల్ని నిందించడం తగదని తెలిపింది. అక్కడి ప్రభుత్వంలోనే అసమర్థత నెలకొందని.. ఇలాంటి చర్యలకు తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆప్ఘనిస్తాన్ హెచ్చరించింది. ఈ విషయంలో ఇస్లామిక్ ఎమరేట్ ఆఫ్ అఫ్ఘనిస్తాన్ సార్వభౌమత్వం ఏమాత్రం రాజీ పడదని పేర్కొంది. తూర్పు ప్రావిన్స్లోని ఖోస్ట్, పాక్టికలో సోమవారం పాకిస్థాన్ విమానాలు దాడులు నిర్వహించింది. ఇప్పటికే పాక్-ఆప్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఈ దాడులు జరగడం మరింత ఉద్రిక్తతలకు ఆజ్యం పోసినట్లుగా కనిపిస్తోంది.
Also Read
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
ఇది కూడా చదవండి: Tamilisai Soundararajan: తెలంగాణ ప్రజలనుద్దేశించి మాజీ గవర్నర్ తమిళిసై ఓ సందేశం..
పాకిస్థాన్లోని ఖైబర్ ప్రాంతంలో రెండ్రోజుల క్రితం భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భద్రతా సిబ్బంది మరణించారు. వీరి అంత్యక్రియల సందర్భంగా పాక్ అధ్యక్షుడు జర్దారీ స్పందిస్తూ కచ్చితంగా తమ వీరుల త్యాగాలు వృథాగా పోవని ప్రతిజ్ఞ చేశారు. టీటీపీ ఉగ్రవాదులే ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ సంస్థను ఆప్ఘనిస్థాన్ భూభాగం కేంద్రంగా నడిపిస్తున్నారు. మొత్తానికి సోమవారం పాక్ ప్రతీకార చర్యలకు పూనుకుంది.
ఇటీవల పాక్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నవాజ్ షరీఫ్-భుట్టో పార్టీల కూటమితో ప్రభుత్వం ఏర్పడింది. జర్దారీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
తాజావార్తలు
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!