Bomb Blast: పాకిస్తాన్ మసీదులో ఆత్మాహుతి దాడి..50మందికి పైగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్తాన్ పెషావర్లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులో మధ్యాహ్నం నమాజ్ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో అంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. కాగా ఇది ఆత్మాహుతి దాడి అని అధికారులు స్పష్టం చేశారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి నమాజ్ చేస్తున్న ముందు వరుసలో కూర్చుని ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. ఈ పేలుడు కారణంగా 28 మంది వరకు మరణించగా..150 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పాక్ అధికారులు పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని వెల్లడించారు.
ఈ బాంబు దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. సుమారు 150 మంది ప్రజలు మసీదులో ప్రార్థనలు చేస్తుండగా.. పేలుడు పదార్థాలతో వచ్చి ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని అక్కడి స్థానిక పోలీస్ అధికారి జాఫర్ ఖాన్ వెల్లడించినట్టు న్యూస్ ఏజెన్సీ ఏపీ రిపోర్ట్ వెల్లడించింది. ఈ బాంబు పేలుడుతో పెషావర్లోని ఆ మసీదు చాలా భాగం కూలిపోయిందని, శిథిలాల కింద ఉన్న వారిని బయటికి తీసేందుకు సహాయక చర్యలు చేపడుతున్నట్టు అక్కడి పోలీసులు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!