PAK vs BAN: టీ20 వరల్డ్ కప్ సమయంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకున్నాయి. బంగ్లాదేశ్ టోర్నీ నుంచి బయటకు వెళ్లడానికి పాక్ క్రికెట్ బోర్డు కూడా ఒక కారణం. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న సిరీస్ ఒక్క ‘‘రనౌట్’’ కారణంగా తీవ్ర వివాదంగా మారింది. పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డేలో సల్మాన్ అలీ అఘా రనౌట్ కావడం వివాదానికి దారితీసింది. బంగ్లాదేశ్ కెప్టెన్ లిటన్ దాస్ రనౌట్ పూర్తిగా నిబంధనల పరిధిలో ఉందని,ఆట స్ఫూర్తిని ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. సల్మాన్ అలీ ఆఘా, రమీజ్ రాజా వంటి వారు దీనిని క్రీడా స్ఫూర్తిని ఉల్లంఘించడమేనని విమర్శించారు. మార్చి 13వ తేదీ శుక్రవారం జరిగిన రెండో వన్డేలో రనౌట్ విషయంలో వివాదం చెలరేగింది. ఈ సంఘటనపై బంగ్లాదేశ్, పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం జరిగింది.
Read Also: Exams: ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షలు ఏవో తెలుసా.. మన ఇండియా నుంచి కూడా ఉన్నాయ్…
పాకిస్తాన్ బ్యాటర్లు సల్మాన్ అఘా, మహ్మద్ రిజ్వాన్ బలమైన భాగస్వామ్యాన్ని నిర్మిస్తుండగా 39వ ఓవర్లో ఈ సంఘటన జరిగింది . బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హసన్ మీరాజ్ బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో రిజ్వాన్ బాల్ను మెల్లిగా కొట్టగా అది నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న మిరాజ్ వైపు వెళ్లింది. ఆ సమయంలో క్రీజ్ బయట ఉన్న సల్మాన్ అలీ ఆఘా మిరాజ్కు బాల్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఆ లోపే మిరాజ్ బాల్ తీసుకుని, వికెట్ల వైపు విసిరాడు. బెయిల్స్ లేచే సమయంలో ఆఘా క్రీజ్ బయట ఉన్నాడు. దీంతో ఎంపైర్ అతడిని ఔట్గా ప్రకటించారు. ఈ ఘటనపై ఆఘా, మిరాజ్తో వాగ్వాదానికి దిగాడు. లిట్టన్ దాస్ జోక్యం చేసుకోవడం పరిస్థితి కొంతవరకు దిగజారింది, కానీ రిజ్వాన్ జోక్యం చేసుకుని పరిస్థితిని శాంతింపజేశాడు. అయితే, మ్యాచ్ తర్వాత కూడా ఉద్రిక్తత కొనసాగింది, ఇరువర్గాలు ప్రకటనలు మార్చుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది.
మ్యాచ్ తర్వాత లిటన్ దాస్ మాట్లాడుతూ.. ఇది ఛారిటీ మ్యాచ్ కాదని, ఇది అంతర్జాతీయ మ్యాచ్ అని, నిబంధనల ప్రకారం అవుట్ అయితే, అది క్రీడాస్పూర్తికి విరుద్ధం కాదని స్పష్టం చేశారు. ఈ సంఘటనపై వ్యాఖ్యానిస్తూ, రమీజ్ రాజా మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం ఇది ఖచ్చితంగా అవుట్ అయినప్పటికీ, బ్యాట్స్మన్ బౌలర్కు సహాయం చేయడానికి ప్రయత్నించడం వల్ల ఆట స్ఫూర్తి దెబ్బతింటుందని అన్నారు. అయితే, లిటన్ దాస్ ఈ అభిప్రాయంతో విభేదించాడు. ప్రతి ఒక్కరూ తమ సొంత అభిప్రాయాన్ని కలిగి ఉండవచ్చు, కానీ ఆటగాళ్లకు అవుట్ అంటే అవుట్ అని ఆయన అన్నారు. మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో సల్మాన్ అలీ ఆఘా మాట్లాడుతూ, మిరాజ్ స్థానంలో తాను ఉండి ఉంటే బహుశా అలాంటి పని చేసి ఉండేవాడని అన్నారు. ఆటలో క్రీడా స్ఫూర్తి ఒక అంశంగా ఉండాలని ఆయన నమ్ముతున్నారు. ఈ వివాదం ఉన్నప్పటికీ, పాకిస్తాన్ మ్యాచ్లో అద్భుతంగా రాణించి డక్వర్త్ లూయిస్-స్టెర్న్ (DLS) నియమం ప్రకారం బంగ్లాదేశ్ను 128 పరుగుల తేడాతో ఓడించింది.
Crucial moment! Mehidy Hasan Miraz removes Salman Agha with a brilliant run-out. ⚡🏏#BCB #Cricket #Bangladesh #Pakistan #ODI pic.twitter.com/N0inKkZVwz
— Bangladesh Cricket (@BCBtigers) March 13, 2026