Pawan Kalyan: ఉగ్రదాడి ఘటన తీవ్రంగా కలచివేస్తోంది: పవన్ కల్యాణ్
- బైసరన్ లోయలో ఉగ్రదాడి
- ఉగ్రదాడి ఘటన తీవ్రంగా కలచివేస్తోందన్న పవన్
- ఈ క్లిష్ట సమయంలో అందరం దృఢంగా ఉందాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గాం సమీప బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి తనను తీవ్రంగా కలచివేస్తోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు జనసేన అధినేత ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో అందరం దృఢంగా ఉందాం అని, మన భారత ఐక్యతను ఉగ్రవాదం విచ్ఛిన్నం చేయలేదని పేర్కొన్నారు. ఉగ్రదాడిలో మరణించిన వారి గౌరవార్థం జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తుందని పవన్ కల్యాణ్ చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బైసరన్ లోయలోకి సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు.. పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు.
ఉగ్రదాడిని ఖండిస్తూ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ జెండాను పవన్ కల్యాణ్ అవనతం చేశారు. ‘పహల్గాంలో జరిగిన దాడి నన్ను తీవ్రంగా కలచివేస్తోంది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. చనిపోయిన వారి గౌరవార్థం జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు సంతాప దినాలను పాటిస్తుంది. పార్టీ జెండాను అవనతం చేస్తున్నాం. ఈ క్లిష్ట సమయంలో అందరం దృఢంగా ఉందాం, మన భారత ఐక్యతను ఉగ్రవాదం విచ్ఛిన్నం చేయలేదు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఇలాంటి దారుణాలు మరలా జరగకుండా చూడాలి. భారత సాయుధ దళాలపై పూర్తి నమ్మకం ఉంది. సమష్టిగా మనం దీన్ని అధిగమిద్దాం, కలిసి కట్టుగా ఉందాం’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
Also Read
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!