Jason Holder: జట్టు విజయం కోసం స్పిన్నర్గా మారిన పేసర్..చివరికి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెస్టు మ్యాచ్లో ఉన్న మజానే వేరు. చివర్లో విజయం కోసం రెండు జట్లు ఎంతో పట్టుదల ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రత్యర్థిని నిర్ణీత ఐదు రోజుల్లో కట్టడి చేయలేకపోతే మ్యాచ్ డ్రాగా మిగిలిపోతుంది. మిగతా ఫార్మాట్లలో అయితే ఎలాగైనా విజేతను నిర్ణయించే అవకాశం ఉంది. కానీ టెస్టుల్లో అది లేదు. మ్యాచ్ డ్రా అయిందంటే.. డ్రా అంతే. అందుకే గెలిచేందుకు అన్ని జట్లు చాలా కష్టపడతాయి. తాజాగా వెస్టిండీస్, జింబాబ్వే మధ్య జరిగిన టెస్టు మ్యాచ్లో కూడా అలాంటి దృశ్యమే కనిపించింది. ఈ టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన విండీస్ భారీ స్కోరు చేసింది. టెగనరైన్ చందర్పాల్ డబుల్ సెంచరీ చేయడంతో 447/6 స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం జింబాబ్వే తొలి ఇన్నింగ్సులో 379/9 వద్ద డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో విండీస్ 203/5 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి, జింబాబ్వే ముందు మంచి టార్గెట్ ఉంచింది. దీంతో మ్యాచ్ డ్రా చేసుకునేందుకు జింబాబ్వే ప్రయత్నించింది. ఆట ముగిసే సరికి 134/6 స్కోరుతో మ్యాచ్ డ్రా చేసుకుంది.
Also Read: KS Bharat: ద్రవిడ్ మాటలు నా కెరీర్ను మార్చేశాయి: కేఎస్ భరత్
Also Read
అయితే, ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని విండీస్ జట్టు రకరకాల ప్రయోగాలు చేసింది. ఐదో రోజు ఆటలో పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం అందుతోందని చూసి కొత్త ప్లాన్ కూడా వేసింది. దీనిలో భాగంగానే ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ ఆశ్చర్యకరంగా స్పిన్ బౌలింగ్ వేశాడు. సాధారణంగా మీడియం పేస్ బౌలింగ్ వేసే హోల్డర్.. పిచ్ను తనకు అనుకూలంగా వాడుకోవాలనే ఆలోచనతో ఆఫ్స్పిన్ బౌలింగ్ చేశాడు. వికెట్లేమీ తీయలేకపోయినా.. తను వేసిన రెండు ఓవర్లలో కేవలం ఆరు పరుగులే ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇన్ని చేసినా విండీస్ చివరకు మ్యాచ్ గెలవలేకపోవడంపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?