Chidambaram: ఎన్నికల్లో మతం ప్రస్తావన ఉండకూడదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత ప్రజాస్వామ్య భారతదేశంలో అతి పెద్ద మైనారిటీలైన ముస్లింలు పౌరులు కాదని మాజీ హోం మంత్రి చిదంబరం పేర్కొన్నారు. హిందువులు కాని వారు సగం పౌరులని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఫ్యూచర్ ఆఫ్ డెమోక్రసీపై తన ఉపన్యాసంలో ఆయన ఈ విషయాలను తెలిపారు. ప్రస్తుత భారత ప్రజాస్వామ్యం గురించి వాస్తవాలను నిర్మొహమాటంగా చెప్పారు. చాలా మంది ప్రజలు భయంతో జీవిస్తున్నారు.. మాజీ న్యాయ మంత్రి కూడా కొలీజియం వ్యవస్థ కోసం పోరాటం చేశారు.. భారతదేశంలో ఎలాంటి ప్రభుత్వం ఉందో.. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుంది అనేది మనం చూడొచ్చు అని మాజీ హోం మంత్రి చిదంబరం అన్నారు.
Read Also: Minister KTR: కేటీఆర్ రోడ్ షో షెడ్యూల్.. ఇవాళ ఎక్కడంటే..
Also Read
- 200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
- Ponnam Prabhakar: "ఆ రోజే అనుమానం వచ్చింది".. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
- Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
అయితే, ఎన్నికల్లో మతం ప్రస్తావన ఉండకూడదు.. కానీ, ప్రస్తుత ఎన్నికల్లో ఇది చాలా వరకు జరుగుతోంది అని చిదంబరం తెలిపారు. మతం విశ్వాసం మీద ఆధారపడి ఉండాలి.. ఒక రాజకీయ పార్టీ హిందువులను కాకుండా ఇతర అభ్యర్థులను నిలబెట్టడానికి నిరాకరిస్తూనే ఉందని ఆయన వెల్లడించారు. అఖండ భారతదేశం హిందూ రాష్ట్రంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. మతం నిర్ణయాత్మక అంశంగా కనిపిస్తోంది.. ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించే సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు అంటూ చిదంబరం అసహనం వ్యక్తం చేశారు.
Read Also: IPL 2024 Retentions: స్టోక్స్, రాయుడుకు గుడ్బై.. చెన్నై రిలీజ్, రిటెన్షన్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే!
రిజర్వేషన్ల ప్రయోజనాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందు కులాల వారీగా సర్వే అవసరం.. కేంద్ర ప్రభుత్వం జనాభా గణనతో పాటు దానిని నిర్వహించాలని మాజీ హోం మంత్రి చిదంబరం అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2021లో నిర్వహించాల్సిన జనగణనను నిర్వహించకపోవడంతో.. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దాన్ని వాయిదా వేశారు. బీహార్ ప్రభుత్వం కులాల వారీగా సర్వే నిర్వహించి.. అణగారిన వర్గాలకు 65 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసిందని చిదంబరం గుర్తు చేశారు. జాతీయ జనగణన కేంద్ర ప్రభుత్వ పరిధిలో మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ జనాభా గణనను నిర్వహించలేవు.. కావున కులాల వారీగా గణన చేయాలని నిర్ణయించారు.. ఎందుకంటే ఇది లేకుండా ఎంత మంది రిజర్వేషన్ ప్రయోజనాలను కోల్పోతున్నారో తెలుసుకోవడం సాధ్యం కాదు అని చిదంబరం చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Alia Bhatt :కేన్స్లో అలియాను పట్టించుకోలేదా..?
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
Ponnam Prabhakar: “ఆ రోజే అనుమానం వచ్చింది”.. పెట్రోల్ ధర పెరుగుదలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!