Boat Capsizes: కాంగోలో పడవ బోల్తా.. 86 మంది మృతి
- కాంగోలో ఘోర ప్రమాదం..
- పడవ బోల్తా పడిన ఘటనలో 86 మందికి పైగా ప్రయాణికులు మృతి..
- రాజధాని కిన్షాసాకు సమీపంలోని ఓ నదిలో పడవ బోల్తా పడినట్లు తెలిపిన అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెక్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగోలో ఓ పడవ బోల్తా పడిన ఘటనలో 86 మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. రాజధాని కిన్షాసాకు సమీపంలోని ఓ నదిలో పడవ బోల్తా పడిపోయినట్లు అధ్యక్షుడు ఫెలిక్స్ షిసెక్డి తెలిపారు. కాగా, ఈ ప్రమాద సమయంలో పడవలో సుమారు 270 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇంజిన్ ఫెయిల్యూర్ కావడం వల్లే పడవ మునిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో 179 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. మరో 86 మంది మరణించారు. ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద పడవ ప్రమాదమని ఆ దేశ అధ్యక్షుడు వెల్లడించారు.
Read Also: Schools Reopen: ఏపీ వ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
Also Read
కాగా, దట్టమైన అటవులు, నదుల కారణంగా కాంగోలో రోడ్డు వ్యవస్థ సరిగ్గా లేదు. జనం పడవ ప్రయాణాలకే ఎక్కువగా మొగ్గు చూపుతారు. పడవ ప్రమాదాలు ఆ దేశంలో సర్వసాధారణం. ఫిబ్రవరిలోనూ నాటు పడవ మునిగి 24 మందికి పైగా చనిపోయారు. అలాగే, సోమాలియా, ఇథియోపియాలకు చెందిన వలసదారుల 260 మంది వలసదారులతో ఉత్తర సోమాలియా తీరం నుంచి బయలుదేరిన పడవ మంగళవారం యెమెన్ తీరంలో మునిగిపోవడంతో 49 మంది చనిపోయారు. మరో 140 మంది గల్లంతైపోయ్యారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ ఈ విషయం మంగళవారం వెల్లడించింది.
తాజావార్తలు
-
DRAGON : ఎన్టీఆర్ – నీల్ టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్.. 4 నిమిషాల 35 సెకన్ల ఊచకోత
-
Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక రూపాయికే 4 కిలోమీటర్ల ప్రయాణం.. ధరలు కేవలం రూ.50,000 నుండి ప్రారంభం
-
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్ లో ప్రమాదం.. రెండు కోచ్లలో చెలరేగిన మంటలు
-
Pawan Kalyan: పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా కమిటీలు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
-
MEGA 158 : ‘బాబీ – చిరు’ సినిమాకు అన్ని అడ్డంకులు క్లియర్.. షూట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..