Manipur: మిజోరాంలో తలదాచుకున్న 5,800 మంది మణిపూర్ వాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: ప్రశాంతంగా ఉన్న మణిపూర్లో రిజర్వేషన్లు చిచ్చుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ ప్రజలకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. అల్లర్లతో రాష్ట్రం అట్టుడికింది. హింసలో గ్రామాలకు గ్రామాలు తగలబడిపోయాయి. ఈ హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో మణిపూర్ నుంచి 5,800 మందికి పైగా ప్రజలు మిజోరాంకు పారిపోయి వివిధ జిల్లాల్లో తలదాచుకున్నారని ఆదివారం అధికారులు తెలిపారు. మైతీలు, గిరిజనులకు మధ్య పరస్సర దాడులు పెరగడం వల్ల మణిపూర్ నుంచి చాలా మంది వలసబాటపట్టారు. మణిపూర్కు చెందిన 5800 మందికిపైగా మిజోరాంలోని వివిధ జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నారని అధికారులు తెలిపారు. వారంతా చిన్, కుకి, మిజో తెగలకు చెందివారేనని చెప్పారు. వీరంతా మిజోరాంలోని ఆరు జిల్లాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో తల దాచుకుంటున్నారని వెల్లడించారు.
Read Also: CBI Director: సీబీఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్.. కర్ణాటక డీజీపీకి కేంద్రం కీలక బాధ్యతలు
Also Read
- Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
- Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
- Meerpet: ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
ప్రస్తుతం ఐజ్వాల్ జిల్లాలో అత్యధికంగా 2021 మంది ఆశ్రయం పొందారని , ఆ తర్వాతి స్థానాల్లో కొలాసిబ్ (1,847), సైచువల్ (1,790) ఉన్నారని చెప్పారు. ఇదిలావుండగా, గిరిజనులకు ప్రత్యేక పరిపాలన కోసం మణిపూర్ గిరిజన ఎమ్మెల్యేల డిమాండ్ను మిజోరాం లోక్సభ సభ్యుడు సి లాల్రోసంగ సమర్థించారు. మణిపూర్ ప్రభుత్వంలో ఆదివాసీ ప్రజలు ఇకపై ఉండలేరని పేర్కొంటూ, హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ప్రత్యేక పరిపాలనను రూపొందించాలని బీజేపీకి చెందిన ఏడుగురు సహా 10 మంది కుకీ ఎమ్మెల్యేలు శుక్రవారం కేంద్రాన్ని కోరారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్కు వ్యతిరేకంగా మే 3న కొండ జిల్లాల్లో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించడంతో మణిపూర్లో ఘర్షణలు చెలరేగాయి. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ నుంచి కుకీ గ్రామస్తులను తొలగించడంపై ఉద్రిక్తతతో హింస చెలరేగింది. మణిపూర్ జనాభాలో మైతీలు దాదాపు 53 శాతం ఉన్నారు. ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజనులు, నాగాలు, కుకీలు జనాభాలో మరో 40 శాతం ఉన్నారు. కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.
తాజావార్తలు
-
Dating Rumours: మృణాల్, రిషబ్ పంత్పై డేటింగ్ రూమర్స్!.. ఒక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోతో వైరల్
-
Boyfriend for Rent: ఇండియాలో అద్దెకు బాయ్ఫ్రెండ్.. గంటకు ఎంత ఛార్జ్ చేస్తున్నారు?
-
Mudragada Daughter: కూతురు క్రాంతిని అడ్డుకున్న ముద్రగడ అనుచరులు.. గోబ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు!
-
Shubman Gill Retires Hurt: ఆట మధ్యలోనే మైదానం వీడిన కెప్టెన్.. అసలేమైంది.?
-
Toxic Work Culture: వాష్రూమ్కి వెళ్లిన టైమ్ కూడా కౌంట్ చేశాడు..మేనేజర్ మైండ్సెట్పై ఉద్యోగి ఆవేదన
ట్రెండింగ్
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!