Manipur: మిజోరాంలో తలదాచుకున్న 5,800 మంది మణిపూర్ వాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: ప్రశాంతంగా ఉన్న మణిపూర్లో రిజర్వేషన్లు చిచ్చుపెట్టాయి. రాష్ట్ర జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ తెగ ప్రజలకు ఎస్టీ హోదా ఇవ్వొద్దంటూ ఈ నెల 3న ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. అల్లర్లతో రాష్ట్రం అట్టుడికింది. హింసలో గ్రామాలకు గ్రామాలు తగలబడిపోయాయి. ఈ హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో మణిపూర్ నుంచి 5,800 మందికి పైగా ప్రజలు మిజోరాంకు పారిపోయి వివిధ జిల్లాల్లో తలదాచుకున్నారని ఆదివారం అధికారులు తెలిపారు. మైతీలు, గిరిజనులకు మధ్య పరస్సర దాడులు పెరగడం వల్ల మణిపూర్ నుంచి చాలా మంది వలసబాటపట్టారు. మణిపూర్కు చెందిన 5800 మందికిపైగా మిజోరాంలోని వివిధ జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నారని అధికారులు తెలిపారు. వారంతా చిన్, కుకి, మిజో తెగలకు చెందివారేనని చెప్పారు. వీరంతా మిజోరాంలోని ఆరు జిల్లాల్లో ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో తల దాచుకుంటున్నారని వెల్లడించారు.
Read Also: CBI Director: సీబీఐ డైరెక్టర్గా ప్రవీణ్ సూద్.. కర్ణాటక డీజీపీకి కేంద్రం కీలక బాధ్యతలు
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
ప్రస్తుతం ఐజ్వాల్ జిల్లాలో అత్యధికంగా 2021 మంది ఆశ్రయం పొందారని , ఆ తర్వాతి స్థానాల్లో కొలాసిబ్ (1,847), సైచువల్ (1,790) ఉన్నారని చెప్పారు. ఇదిలావుండగా, గిరిజనులకు ప్రత్యేక పరిపాలన కోసం మణిపూర్ గిరిజన ఎమ్మెల్యేల డిమాండ్ను మిజోరాం లోక్సభ సభ్యుడు సి లాల్రోసంగ సమర్థించారు. మణిపూర్ ప్రభుత్వంలో ఆదివాసీ ప్రజలు ఇకపై ఉండలేరని పేర్కొంటూ, హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ప్రత్యేక పరిపాలనను రూపొందించాలని బీజేపీకి చెందిన ఏడుగురు సహా 10 మంది కుకీ ఎమ్మెల్యేలు శుక్రవారం కేంద్రాన్ని కోరారు. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మైతీ కమ్యూనిటీ డిమాండ్కు వ్యతిరేకంగా మే 3న కొండ జిల్లాల్లో ‘గిరిజన సంఘీభావ యాత్ర’ నిర్వహించడంతో మణిపూర్లో ఘర్షణలు చెలరేగాయి. రిజర్వ్ ఫారెస్ట్ ల్యాండ్ నుంచి కుకీ గ్రామస్తులను తొలగించడంపై ఉద్రిక్తతతో హింస చెలరేగింది. మణిపూర్ జనాభాలో మైతీలు దాదాపు 53 శాతం ఉన్నారు. ఇంఫాల్ లోయలో ఎక్కువగా నివసిస్తున్నారు. గిరిజనులు, నాగాలు, కుకీలు జనాభాలో మరో 40 శాతం ఉన్నారు. కొండ జిల్లాలలో నివసిస్తున్నారు.
తాజావార్తలు
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!