Food Poison: మహారాష్ట్రలో 160 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. ఆస్పత్రిలో చికిత్స
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని ఓ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిన ఘటన వెలుగు చూసింది. ఉమ్డి గ్రామంలోని ఆశ్రమ పాఠశాలలో 160 మందికి పైగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవడంతో ఆస్పత్రి పాలయ్యారు. ఓ కార్యక్రమంలో ఆహారం తిన్న ఈ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో వాంతులు చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో జరిగింది.
Read Also: Tejashwi Yadav: ‘గుజరాతీలు దుండగులు’ అనే వ్యాఖ్యపై తేజస్వి యాదవ్కు కోర్టు సమన్లు
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
అర్థరాత్రి విద్యార్థుల ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే వైద్యబృందం, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనపై ఐదు నుండి 15 సంవత్సరాల వయస్సు గల బాధిత విద్యార్థులందరి పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ప్రమాదమేమీ లేదని జిల్లా కలెక్టర్ రాజా దయానిధి తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సాంఘిక సంక్షేమ శాఖ విచారణకు కలెక్టర్ ఆదేశించారు.
Read Also: CS Shanti Kumari: జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి వీడియో కాన్ఫరెన్స్
ఉమ్డి గ్రామం సాంగ్లీ జిల్లాలోని జాట్ పట్టణానికి 60 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ సమత అనే ఆశ్రమ పాఠశాల ఉంది. ఈ ఆశ్రమ పాఠశాలలో ప్రస్తుతం 150 నుంచి 200 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆశ్రమ పాఠశాలలో పిల్లల వయస్సు ఐదు సంవత్సరాల నుండి పదిహేనేళ్ల వరకు ఉంటుంది. విద్యార్థులంతా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వారే. ఆదివారం ఉమ్డి గ్రామంలో కుటుంబ సమేతంగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని సమతా ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు అందించినట్లు చెబుతున్నారు. ఆ ఆహారం తిన్న విద్యార్థులు కొద్దిసేపటికే వాంతులు, తలనొప్పి వచ్చినట్లు పాఠశాల యాజమాన్యం తెలుపుతుంది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!