NTV Telugu Site icon

Tamilnadu: బీజేపీకి షాక్.. ఏఐఏడీఎంకేలో చేరిన కమలం నేతలు

Tamilnadu

Tamilnadu

Tamilnadu: తమిళనాడులో బీజేపీకి షాక్ తగిలింది. చెన్నై వెస్ట్‌ బీజేపీ ఐటీ వింగ్‌కు చెందిన 13 మంది నేతలు పార్టీకీ రాజీనామా చేశారు.వారం క్రితం తమిళనాడు బీజేపీ ఐటీ వింగ్ అధ్యక్షుడు నిర్మల్ కుమార్, దిలీప్‌ కన్నన్‌ పార్టీకి రాజీనామా చేసి ఏఐఏడీఎంకేలో చేరిన అనంతరం డజన్ల కొద్దీ కాషాయ పార్టీ కార్యకర్తలు దీనిని అనుసరించారు. పార్టీలో జరుగుతున్న పరిమాణాలు నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రకటించారు.

చెన్నై వెస్ట్‌లోని బీజేపీ ఐటి విభాగానికి చెందిన 13 మంది బీజేపీ కార్యకర్తలు బుధవారం పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం అన్నాడీఎంకేలో చేరిన సీటీఆర్ నిర్మల్ కుమార్ బాటలో నడుస్తామని చెప్పారు. సీటీఆర్ నిర్మల్ కుమార్ గతంలో బీజేపీ ఐటీ విభాగం అధిపతిగా ఉన్నారు. మరోవైపు ట్యూటికోరిన్‌లో బీజేపీ జిల్లా స్థాయి ఓబీసీ మోర్చా కార్యకర్త గోమతి బుధవారం ఉదయం అన్నాడీఎంకేలో చేరారు. ఆమెను అన్నాడీఎంకే సీనియర్ నేత కదంబూర్ రాజు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ కార్యకర్తలు పార్టీని విడిచిపెట్టి, ఏఐఏడీఎంకేలో చేరారు.

Read Also: Nama Nageswara Rao : కవితను ఈడీ విచారణకు రావాలని ఆదేశించడం కక్ష సాధింపు

మంగళవారం, బీజేపీ ఐటీ విభాగం మాజీ రాష్ట్ర కార్యదర్శి దిలీప్ కన్నన్ పార్టీని విడిచిపెట్టిన అనంతరం బీజేపీకి చెందిన మహిళా కార్యకర్త సహా మరో ముగ్గురు, దాని ఏఐఏడీఎంకే తాత్కాలిక చీఫ్ కె.పళనిస్వామి సమక్షంలో పార్టీలో చేరారు. మిత్రపక్షమైన అన్నాడీఎంకే తమ పార్టీ కార్యకర్తలను వేటాడిందని తమిళనాడు బీజేపీ ఆరోపించింది. ఇదిలావుండగా.. తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే రాష్ట్రంలోని బీజేపీ కార్యకర్తలను వేటాడుతోందని ఆరోపించారు. అన్నామలై ఏఐఏడీఎంకేకి హెచ్చరిక జారీ చేశారు. తాను వేటాడాలని నిర్ణయించుకుంటే జాబితా చాలా పెద్దదిగా ఉంటుందని హెచ్చరించారు. తమిళనాడులో బీజేపీ పెరిగిందని ఇది తెలియజేస్తోందని కె.అన్నామలై అన్నారు. మనం ఇతర ద్రావిడ పార్టీల నుంచి నాయకులను వేటాడి బీజేపీ ఎదగడానికి సహాయం చేయాల్సిన సమయం ఉందన్నారు. ఇప్పుడు కొన్ని ద్రావిడ పార్టీలు ఎదగాలంటే, వారు బీజేపీ నుంచి నాయకులను వేటాడాలని కె.అన్నామలై అన్నారు.