Siddaramaiah: బాలాసోర్ రైలు ప్రమాదంలో కన్నడిగుల భద్రతకు మేం అండగా ఉంటాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశా రైలు ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేస్తూ కన్నడిగుల భద్రతకు భరోసా ఇచ్చారు. బాలాసోర్ రైలు ఘటనలో కర్ణాటక వాసుల భద్రతకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. రైలు ప్రమాదంలో బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులను సీఎం సిద్ధరామయ్య ఆదేశించారు. నిన్న ఒడిశా రాష్ట్రంలో జరిగిన ఘోర రైలు ప్రమాదం విషయంలో అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రమాదానికి గల కారణాలను కనిపెట్టాలి.. మరో ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలి.. ఆ కుటుంబాలకి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని కర్ణాటక సీఎం అన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తాను ప్రగాఢ సానూభూతి తెలియజేస్తున్నాను అని సిద్ధరామయ్య తెలిపారు.
Also Read : Adipurush: ‘ఆదిపురుష్’ కోసం మీ సాహసం.. గుర్తుండిపోతారయ్యా
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
నిన్న ( శుక్రవారం ) రైలు ఢీకొనడానికి గల కారణాన్ని కనుక్కోవాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు. మృతుల సంఖ్య 290కి పెరిగింది.. 1000 మందికి పైగా గాయపడ్డారు. స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ప్రాథమిక నివేదిక ప్రకారం, 900 మందికి పైగా గాయపడ్డారు. నివేదిక ప్రకారం టోల్ 238 నుండి 261కి పెరిగిన్నట్లు వెల్లడించింది.
Also Read : Gold Rates: పసిడి ప్రియులకు అలర్ట్.. శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..!
ఈ ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఏడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలు, ఐదు ఒడిశా డిజాస్టర్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ODRAF) యూనిట్లు మరియు 24 ఫైర్ సర్వీసెస్ మరియు ఎమర్జెన్సీ యూనిట్లు రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమై ఉన్నాయి. భారత వైమానిక దళం (IAF) మరణించిన మరియు గాయపడిన వారి తరలింపు కోసం Mi-17 హెలికాప్టర్లను మోహరించింది. తూర్పు కమాండ్ ప్రకారం, IAF పౌర పరిపాలన మరియు భారతీయ రైల్వేలతో సహాయక చర్యలను సమన్వయం చేస్తోంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!