ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ తో కొత్త స్మార్ట్ ఫోన్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.. మార్కెట్ లో ఈ ఫోన్లకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది.. దాంతో ఇప్పుడు మరో ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేశారు.. ఒప్పో భారత మార్కెట్లోకి ఒప్పో ఏ18 పేరుతో కొత్త ఫోన్ను లాంచ్ చేసింది. గత సెప్టెంబర్లో యూఏఈలో అందుబాటులోకి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ తాజాగా శుక్రవారం భారత మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది.. ఇక ఆలస్యం ఎందుకు ఈ ఫోన్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం..
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 9,999గా ఉంది. గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ బ్లూ కలర్స్లో అందుబాటులో ఉన్న ఒప్పో ఏ18 స్మార్ట్ ఫోన్లో ఒప్పో అధికారిక వెబ్సైట్తో పాటు అన్ని ఆన్లైన్ స్టోర్స్ లలో అందుబాటులో ఉంది.. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్తో కూడిన హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేను అందంచారు. 90 హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో తీసుకొచ్చారు.. జీ85 ఎస్సోసీ ప్రాసెసర్తో పనిచేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేస్తుంది. 4జీ నెట్వర్క్కి సపోర్ట్ చేసే ఈ ఫోన్లో వైఫై, బ్లూటూత్ .3, యూఎస్బీ టైప్సీ, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు..
ఇక సెల్ఫీ ప్రియులకు ఇది బెస్ట్ అని చెప్పాలి.. కెమెరా విషయానికొస్తే.. ఒప్పో ఏ18 స్మార్ట్ ఫోన్లో 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్స్తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ను అందంచారు. ఇక సెల్ఫీల కోసం 5 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామార్థ్యాన్ని కలిగి ఉంటుంది.. ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి..