Trump: అమెరికా చదువులు కలేనా?.. ట్రంప్ మరో పిడుగు.. యూనివర్సిటీల్లో 5% భారతీయ విద్యార్థులకు మాత్రమే అనుమతి
- యూనివర్సిటీల్లో 5% భారతీయ విద్యార్థులకు మాత్రమే అనుమతి
- ట్రంప్ ప్రభుత్వం తొమ్మిది విశ్వవిద్యాలయాలకు మెమో
ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసలు, టారిఫ్స్ వంటి వాటిపై షాకింగ్ డెసిషన్స్ తీసుకుంటూ ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నారు. ఇప్పుడు విదేశీ విద్యా్ర్థులపై ఆంక్షలకు తెరలేపారు. అమెరికాకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనే కాంక్ష ఉన్నవారికి బిగ్ షాక్ తగిలినట్లే. ట్రంప్ ప్రభుత్వం తొమ్మిది విశ్వవిద్యాలయాలకు ఒక మెమో పంపింది. అవి సమాఖ్య నిధులను కొనసాగించాలనుకుంటే కఠినమైన కొత్త షరతులను పాటించాలని కోరింది. ఈ విశ్వవిద్యాలయాలలో భారతీయ విద్యార్థులతో సహా అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యపై పరిమితి అనేది ముఖ్యమైన మార్పులలో ఒకటి. విశ్వవిద్యాలయాలు పాటించకుంటే అవి ఆర్థిక సహాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
Also Read:Pawan Kalyan Tour: రాష్ట్రవ్యాప్త పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సిద్ధం.. ఫస్ట్ ఆ జిల్లాకే…
Also Read
విశ్వవిద్యాలయాలు మొత్తం అండర్ గ్రాడ్యుయేట్ నమోదులో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను 15%కి పరిమితం చేయాలి. ఏ ఒక్క దేశం నుండి అయినా 5% కంటే ఎక్కువ మంది విద్యార్థులు రాకూడదని మెమోలో పేర్కొంది. విద్యార్థులు, అధ్యాపకులు లేదా సిబ్బందికి ప్రవేశాలు లేదా ఆర్థిక సహాయ నిర్ణయాలలో జాతి, లింగాన్ని పరిగణించకూడదని తెలిపింది. విశ్వవిద్యాలయాలు జాతి, జెండర్, జాతీయ మూలం ఆధారంగా విభజించబడిన అడ్మిషన్ల డేటాను బహిరంగంగా పంచుకోవాలని కోరింది. అంతర్జాతీయ విద్యార్థులతో సహా దరఖాస్తుదారులు తప్పనిసరిగా SAT వంటి ప్రామాణిక పరీక్షలను తీసుకోవాలని తెలిపింది.
ట్యూషన్ ఫీజులను ఐదు సంవత్సరాల పాటు స్తంభింపజేయాలి. విశ్వవిద్యాలయాలు అడ్మినిస్ట్రేషన్ ఖర్చులను తగ్గించుకోవాలని కోరారు. పెద్ద ఎండోమెంట్లు ఉన్న విశ్వవిద్యాలయాలు హార్డ్ సైన్స్ ప్రోగ్రామ్ల విద్యార్థులకు ట్యూషన్ ఫీజును మాఫీ చేయాలి. విశ్వవిద్యాలయాలు ఆధిపత్య రాజకీయ భావజాలాల నుండి, ముఖ్యంగా సంప్రదాయవాద ఆలోచనలను శిక్షించే లేదా తక్కువ చేసే వాటి నుండి దూరంగా ఉండాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ విద్యార్థులు “అమెరికన్, పాశ్చాత్య విలువలకు” అనుగుణంగా ఉండేలా పరీక్షించాలని కోరింది.
భారతీయ విద్యార్థులను ఎలా ప్రభావితం చేస్తుంది?
ఈ కొత్త నియమాలు ముఖ్యంగా అమెరికాలోని అంతర్జాతీయ విద్యార్థుల జనాభాలో గణనీయమైన భాగాన్ని కలిగి ఉన్న భారతీయ విద్యార్థులకు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులపై పరిమితి 15%గా నిర్ణయించబడినప్పటికీ, ఏదైనా ఒక దేశం నుండి 5% కంటే ఎక్కువ ఉండకూడదనే అదనపు పరిమితి భారతీయ విద్యార్థులకు హాని కలిగించవచ్చు. భారత్, చైనా అన్ని విదేశీ రికార్డ్స్ లో దాదాపు 35% వాటాను కలిగి ఉన్నాయి.
కొత్త నిబంధనలతో, కొంతమంది భారతీయ విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందడంలో ఇబ్బంది పడవచ్చు. ముఖ్యంగా భారతదేశం నుండి పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు ఉన్న విశ్వవిద్యాలయాలలో ఇబ్బందులు తలెత్తే ఛాన్స్. కొత్త నియమాలు భారతీయ విద్యార్థులు కొన్ని US విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందడం కష్టతరం చేసే అవకాశం ఉంది. తొమ్మిది విశ్వవిద్యాలయాలు మెమోను అందుకున్నాయి. అవేంటంటే?
అరిజోనా విశ్వవిద్యాలయం
బ్రౌన్ విశ్వవిద్యాలయం
డార్ట్మౌత్ కళాశాల
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)
పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం
దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం
టెక్సాస్ విశ్వవిద్యాలయం
వర్జీనియా విశ్వవిద్యాలయం
వాండర్బిల్ట్ విశ్వవిద్యాలయం
ఈ విశ్వవిద్యాలయాలు అమెరికాలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఉన్నాయి. భారతీయ విద్యార్థులు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చేవి ఇవే.
తాజావార్తలు
-
Astrology: ఏప్రిల్ 25, శనివారం దినఫలాలు.. ఈ రాశివారు శుభవార్త వింటారు..!
-
AAP Crisis: “కేజ్రీవాల్ దారి తప్పాడు” అన్నా హజారే సంచలన కామెంట్స్!
-
Off The Record: కాళేశ్వరం కేసు దర్యాప్తు చుట్టూ పొలిటికల్ కలర్..
-
Salt : జాగ్రత్త..! ఉప్పు ఎక్కువగా తింటున్నారా.? ఈ ప్రమాదం గురించి తెలుసుకోండి..!
-
Infinix GT 50 Pro: 6,500mAh బ్యాటరీతో కొత్త గేమింగ్ బీస్ట్.. ఇన్ఫినిక్స్ GT 50 Pro విడుదల
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!