US Open Tennis 2023: ఒక ఆటగాడు చనిపోతాడు.. అప్పుడు కూడా వీళ్లు చూస్తూనే ఉంటారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daniil Medvedev Fires on US Conditions in US Open Tennis 2023: యుఎస్ ఓపెన్ 2203లో వేడి ఉష్ణోగ్రతలు ప్లేయర్లకు పెను సవాలుగా నిలుస్తున్నాయి. వేడి, ఉక్కపోత తట్టుకోలేక ప్లేయర్స్ అనారోగ్యానికి గురవుతున్నారు. అత్యధిక ఉష్ణోగ్రత (35 డిగ్రీల సెల్సియస్)ల మధ్య మ్యాచ్ ఆడిన రష్యా ఆటగాడు డానియల్ మెద్వెదేవ్ అనారోగ్యానికి గురయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఆట రెండో సెట్కు మారే సమయంలో.. అతడు అస్వస్థతకు గురయ్యాడు. వైద్యుడు పరీక్షించిన అనంతరం మెద్వెదెవ్ ఇన్హేలర్ సాయంతో ఆడాడు.
యుఎస్ ఓపెన్ 2203 పరిస్థితులపై మెద్వెదెవ్ అసహనం వ్యక్తం చేశాడు. ఒక ఆటగాడు చనిపోయినా అప్పుడు కూడా వీళ్లు చూస్తూనే ఉంటారు అని మండిపడ్డాడు. మూడవ సెట్ మధ్యలో మెద్వెదేవ్ కెమెరాను చూస్తూ ఇలా చెప్పడం వినిపించింది. ‘ఇక్కడ ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు. ఒక ఆటగాడు చనిపోతాడు. అప్పుడు కూడా వీళ్లు చూస్తూనే ఉంటారు. ఈ ప్రమాదకరమైన వాతావరణంలో ఎంత సమయం ఆడగలం?. కానీ ఏం చేయాలనే దానిపై స్పష్టత లేదు’ అని మెద్వెదెవ్ అన్నాడు.
Also Read
Also Read: G20 Summit: భారత్ బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఢిల్లీ వీధుల్లో తిరగనున్న ‘ది బీస్ట్’!
‘4-5 రోజుల పాటు యుఎస్ ఓపెన్ టోర్నీని నిలిపివేయలేం. ఎందుకంటే.. టీవీ ప్రసారాలు, టికెట్లు, ఫాన్స్.. ఇలా అన్నింటిపై ప్రభావం పడుతుంది. తీవ్రమైన ఎండ కారణంగా తొలి సెట్ తర్వాత బంతిని అస్సలు చూడలేకపోయా. తీవ్ర అస్వస్థతకు గురయ్యా’ అని డానియల్ మెద్వెదెవ్ పేర్కొన్నాడు. వేడిని తట్టుకోలేని ప్లేయర్లు మంచు ముక్కలతో నిండిన సంచులను వాడుతున్నారు. మరోవైపు నిర్వాహకులు ట్యూబ్ల నుంచి చల్లని గాలిని వదులుతున్నారు. క్వార్టర్ ఫైనల్లో తన దేశానికే చెందిన ఆండ్రీ రుబ్లెవ్ను ఓడించిన మెద్వెదెవ్.. నాలుగోసారి సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు.
తాజావార్తలు
-
Team India Players: అఫ్గాన్ సిరీస్కు వన్డే, టెస్ట్ జట్ల ఎంపిక.. ఎవరెవరికి ఛాన్స్ ఇచ్చారంటే..
-
Putin: మరోసారి భారత్ టూర్కు పుతిన్.. ఎప్పుడంటే..!
-
Twisha Sharma Case: ట్విషా శర్మ భర్తపై లుక్ ఔట్ నోటీసులు
-
Manchu Manoj: రాజకీయాల్లోకి మంచు వారి కోడలు! స్పష్టం చేసిన హీరో మనోజ్….
-
PM Modi: ఐస్లాండ్ ప్రధాని క్రిస్ట్రాన్ మ్జోల్తో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
ట్రెండింగ్
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!