Tillu Square : మళ్లీ లవ్ లో ఫెయిలైన టిల్లు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్య సినిమా జోష్ తో తన సినీ కెరీర్ను ప్రారంభించిన సిద్ధు జొన్నలగడ్డ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. పదేళ్ల క్రితమే నటుడిగా సినీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ మధ్య డీజే టిల్లు అంటూ వచ్చి.. భారీ హిట్ అందుకున్నాడు జొన్నలగడ్డ . ఆ సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపింది. కేవలం ఇక్కడమాత్రమే కాకుండా అటు ఓవర్సీస్ లో కూడా మంచి కలెక్షల్స్ ను రాబట్టింది ఈ సినిమా. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ఓ సినిమా వస్తోన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకు టిల్లు స్క్వేర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇక ఈ సినిమాకి సంబంధించి అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో మార్చి29న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకానుంది. ఇందులో భాగంగానే ఇదివరకే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.
Also read: Election Commission: “రెడ్ లైన్ క్రాస్ చేయొద్దు”.. పొలిటికల్ పార్టీలకు ఈసీ వార్నింగ్..
Also Read
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
మల్లిక్ రామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ టిల్లు స్క్వేర్ ట్రైలర్ మాత్రం యూత్ ఫుల్ కంటెంట్ తో అదరకొట్టింది. ట్రైలర్ ను చూస్తే.. మొదటి పార్ట్ కంటే కూడా డబుల్ డోస్ తో ఈ సినిమా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. ట్రైలర్ లో ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్, సిద్దు జొన్నలగడ్డల మధ్య జరిగే కెమిస్ట్రీ అదిరిపోయింది. వీటికితోడు అనేక కామెడీ సన్నివేశాలు కూడా సినిమాలో ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి థియేటర్స్ లో సినిమా ఎలా ఆకట్టుకుంటుందో. ఈ సినిమా సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై విడుదల కాబోతుంది.
Also read: Odisha Assembly Polls: ఒడిశాలో 4 దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. షెడ్యూల్ ఇదే..
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన రాధిక సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. మార్చి 18 మరోసారి ఈ సినిమా నుండి మరో పాటను విడుదల చేయనుంది చిత్ర బృందం. ‘ ఓ మై లిల్లీ ‘ అంటూ సాగే పాటను మార్చి 18 హైదరాబాద్ లోని AMB మాల్ లో నిర్వహించే ఈవెంట్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటను ప్రముఖ గాయకుడు శ్రీరామ్ చంద్ర పాడినట్లు తెలుస్తోంది. ఫుల్ ఎనర్జిటిక్ గా ఉండే జొన్నలగడ్డకి ఈ పాట ఏ మాత్రం సూట్ అవుతుందో చూడాలిమరి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 29న భారీగా విడుదలకానుంది. తాజాగా ‘ ఓ మై లిల్లీ ‘ పాటకు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యింది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.
తాజావార్తలు
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
-
Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!