NTV Telugu Site icon

Murder : హైదరాబాద్‌లో మరో దారుణ హత్య

Murder

Murder

హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నార్సింగిలో ఓ ఇంజినీర్ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. హైదరాబాద్‌కు చెందిన ఇంజినీర్ ఇజాయత్ అలీ దుబాయ్ నుంచి 20 రోజుల క్రితం నగరానికి వచ్చాడు. ఈ క్రమంలో ఈరోజు నిర్మానుష్య ప్రాంతంలో అతడిని గొంతుకోసి దుండగులు చంపేశారు. క్వాలిస్ వాహనంలో వచ్చిన ఇద్దరు యువకులు, ఓ యువతి అతడిని చంపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ క్వాలీస్ కారులో ఇంజనీర్ ను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొని వచ్చి గొంతు కోసి దుండగులు హత మార్చినట్లు పేర్కొన్నారు.

కారులో ఇద్దరు యువకులతో పాటు ఓ లేడి కిలాడి వచ్చి నట్లు సమాచారం. ఇద్దరు ఇంజనీర్ కాళ్లు పట్టుకొగా ఒకరు కత్తితో గొంతు కోసి పారిపోయినట్లు పోలీసులు ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. అయితే.. హత్య అనంతరం కారును అక్కడే వదిలేసి పారిపోయారు దుండగులు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే హుటాహుటిన ఘటన స్థలానికి నార్సింగీ పోలీసులు చేరుకున్నారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ బృందాలు.. ‌పలు ఆధారాలు స్వేకరించినట్లు తెలుస్తోంది. అలీ ని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఇక్కడికి ఏమని చెప్పి తీసుకొని వచ్చారు? అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. క్వాలీస్ కారు తో పాటు రెండు ఫోన్లు సీజ్ చేశారు నార్సింగీ పోలీసులు.