Ola Uber Services: 3రోజుల్లో ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీసులు బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ola Uber Services: ఓలా, ఉబర్, ర్యాపిడో సర్వీసులకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. ఈ మూడు హైరింగ్ సర్వీసులను ఆపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కంపెనీలు ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకుని చార్జీలను భారీ పెంచాయి. దీంతో మూడు రైడ్ హైరింగ్ సంస్థలు ఏఎన్ఐ టెక్నాలజీస్(ఓలా పేరెంట్ సంస్థ), ఉబర్, ర్యాపిడోలకు నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో సర్వీసులను నిలిపి, నివేదిక పంపాల్సిందిగా కర్ణాటక ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్ మెంట్ ఆదేశించింది. రెండు కిలోమీటర్ల దూరానికి కూడా ఈ సంస్థలు కనీస చార్జీల కింద 100రూపాయలు వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు కర్నాటక ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ వద్ద ఫిర్యాదు చేశారు.
బెంగళూరులో మినిమమ్ ఆటో ఛార్జీని తొలి రెండు కిలోమీటర్లకు రూ.30గా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత కిలోమీటర్కి రూ.15 చొప్పున పెరుగుతూ వెళ్తుంది. కానీ ఈ రైడ్ హైరింగ్ సంస్థల ఛార్జీలు రెండు కి.మీలకే కనీసం రూ.100 ఛార్జీ విధిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అత్యధికంగా ప్రయాణికుల వద్ద నుంచి ఛార్జీలు వసూలు చేయడానికి వీలులేదని తెలిపింది. ఆటో సర్వీసుల మూడు రోజుల్లోగా ఆపివేయాలని ఆదేశించిన ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్.. ట్యాక్సీలను నడుపుకునేందుకు మాత్రం అనుమతి ఇచ్చింది. కర్నాటక ఆన్ డిమాండ్ ట్రాన్స్పోర్టేషన్ టెక్నాలజీ అగ్రిగేటర్స్ రూల్స్, 2016 కింద కేవలం ట్యాక్సీలను నడుపుకునేందుకు మాత్రం లైసెన్సులను మంజూరు చేస్తున్నట్టు ట్రాన్స్పోర్టు కమిషనర్ టీహెచ్ఎం కుమార్ తెలిపారు. ఈ రూల్స్ ఆటోలకు అప్లయ్ కావని పేర్కొన్నారు.
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
Read Also: Vande Bharat Train: వందే భారత్ ట్రైన్ యాక్సిడెంట్.. గేదెల యజమానుల కోసం గాలింపు
ట్యాక్సీలంటే.. డ్రైవర్ను మినహాయించి ఆరుగురికి మించి కూర్చునేందుకు వీలు లేని సీటింగ్ సామర్థ్యం ఉన్న మోటార్ క్యాబ్ అని టీహెచ్ఎం కుమార్ తెలిపారు. పైన పేర్కొన్న రెగ్యులేషన్స్ను అతిక్రమించి, ఈ వెహికిల్ అగ్రిగేటర్ సంస్థలు ఆటో రిక్షా సర్వీసులను అందజేస్తున్నాయని అన్నారు. క్యాబ్ అగ్రిగేటర్ లైసెన్సులతో ఆటో రిక్షాలను నడపడానికి వీలు లేదని స్టేట్ ట్రాన్స్పోర్టు అథారిటీ సెక్రటరీ, ట్రాన్స్పోర్టు అదనపు కమిషనర్ ఎల్ హేమంత్ కుమార్ అన్నారు. అగ్రిగేటర్ రూల్స్ కేవలం క్యాబ్లకు మాత్రమేనని తెలిపారు. యాప్ల ద్వారా అందిస్తున్న ఆటో రిక్షా సర్వీసులను ఆపేయాలని తాము ఆదేశించామని, వెంటనే దీనిపై రిపోర్టు సమర్పించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!