దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ CEO మరియు వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.. ఇది గోవా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ చర్యల ఫలితంగా ఏర్పడింది. కేసు విషయాల్లోకి వెళ్తే.. గోవాలోని వినియోగదారుడు ప్రీతిష్ చంద్రకాంత్ ఘాడి ఓలా ఎలక్ట్రిక్ నుండి కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ బైక్లో సమస్యలు తలెత్తడంతో దానిని మరమ్మతుల కోసం కంపెనీకి అప్పగించాడు. అయినప్పటికీ, బైక్ను తిరిగి ఇవ్వకపోవడం మరియు సంబంధిత సమాచారం అందించకపోవడం వలన ఫిర్యాదు అందింది. ప్రీతిష్ ఇప్పటికే బైక్ కోసం పూర్తి ధర చెల్లించాడని కమిషన్ తెలిపింది.
Read Also: సగం ధరకే Havells వాటర్ హీటర్..! ఫీచర్లు అదరిపోయాయి.!
ఇక, ఫిబ్రవరి 4, 2026న జారీ చేసిన ఉత్తర్వులో, కమిషన్ భవిష్ అగర్వాల్పై వ్యక్తిగత హాజరు కావాలని ఆదేశించింది. వినియోగదారుడి పట్ల కంపెనీ నిర్లక్ష్యం కనిపించిందని, బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిందని కమిషన్ తెలిపింది. కమిషన్ ఆదేశాల ప్రకారం CEO హాజరు కాలేదని, కఠిన చర్యలుగా బెంగళూరు పోలీసులు భవిష్ అగర్వాల్పై రూ.1,47,499 బేబిల్గల అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఈ వారెంట్ ఆయన అడ్రస్లో అందజేయబడ్డారు.. ఫిబ్రవరి 23, 2026 ఉదయం 10:30 గంటలకు కమిషన్ లో కేసు విచారణ షెడ్యూల్ అయింది. CEO స్వయంగా హాజరు కావాల్సి ఉంది. ఈ కేసు వినియోగదారుల హక్కులు మాత్రమే కాక, పెద్ద కంపెనీల జవాబుదారీతనానికి కూడా కీలకమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ తేదీ తర్వాత, కమిషన్ అతని వివరణలు మరియు మౌఖిక తుది వాదనలను వింటుంది. ఈ కేసు ఇప్పుడు వినియోగదారుల హక్కులకు మాత్రమే కాకుండా పెద్ద కంపెనీల జవాబుదారీతనానికి కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
