YSRCP : చచ్చేదాకా YCP లోనే అన్న మాజీ ఎమ్మెల్యే.. ఇప్పుడు స్వరం మారుస్తున్నారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ మాజీ ఎమ్మెల్యే కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయా? ఆయన మాటలు ఇప్పుడే ఎందుకు తేడాగా వినిపిస్తున్నాయి? మామీద మీ పెత్తనం ఏంటి? ఎక్కువ చేస్తే… పార్టీ ఆఫీస్ మెట్లు కూడా ఎక్కబోమని ఎందుకు అంటున్నారు? చచ్చేదాకా వైసీపీలోనే ఉంటానని ఒకవైపు చెబుతూనే… మరోవైపు స్వరం మారుస్తున్న ఆ మాజీ ఎవరు? ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఉత్తరాంధ్ర వైసీపీలో ఒక్కొక్కటిగా అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయా అంటే… అవును, అలాగే కనిపిస్తోందంటున్నారు పొలిటికల్ పండిట్స్. అందుకు తాజా ఉదాహరణగా… విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ని చూపిస్తున్నారు. అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా…. ఇటీవల వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ వేదికగా ఆయన అన్న మాటలు, లేవనెత్తిన ప్రశ్నలు చర్చనీయాంశం అవుతున్నాయి. ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ వ్యవస్థ పార్టీ అధినేతకు, తమకు మధ్య అడ్డుగోడగా మారిందన్న మాటల చుట్టూ రకరకాల విశ్లేషణలు పెరుగుతున్నాయి. గతంలో ఆ పోస్ట్లో ఉన్న విజయసాయిరెడ్డి చర్యలవల్ల ఒక్కో నియోజకవర్గంలో కనీసం 10వేల ఓట్లు కోల్పోయామన్న రాజకీయ సూత్రీకరణను తెరపైకి తెచ్చారు వాసుపల్లి. అలాంటి వ్యవస్థ ఇప్పటికీ అవసరమా…? అన్న అభిప్రాయంతో…. ప్రస్తుత కో ఆర్డినేటర్ కన్నబాబును కోట్ చేస్తూ… మాట్లాడ్డాన్ని కాస్త తేడాగానే చూస్తున్నాయట వైసీపీ వర్గాలు. ఇప్పుడు కూడా పాత పద్ధతులనే కొనసాగిస్తామని చెబితే… పార్టీ ఆఫీసులోకి కూడా అడుగు పెట్టబోనంటూ…. తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు మాజీ ఎమ్మెల్యే. దీంతో వాసుపల్లి ఆలోచన ధోరణి వైసీపీ లో విస్తృత చర్చ జరుగుతోందట. ఓవైపు కూటమి ప్రభుత్వం ఏడాది వైఫల్యాలపై పోరాటానికి సమాయత్తం అవుతున్న టైంలో…. వాసుపల్లి లాంటి వాళ్ళు పాత చేదు జ్ఞాపకాలతోనే సహవాసం చేయడం ఏంటని మాట్లాడుకుంటున్నాయట పార్టీ వర్గాలు. ఇక్కడ టీడీపీతో పోలిక తీసుకురావడం మరింత ఇబ్బంది మారిందట వైసీపీ నాయకత్వానికి. వాసుపల్లి గణేష్ రాజకీయంగా ఎదిగింది, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచింది టీడీపీలోనే. 2014, 2019లో విశాఖ దక్షిణ స్థానం నుంచి గెలిచారాయన. ఆ సమయంలో నేరుగా చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉండేదని…కానీ… వైసీపీ అధికారంలో ఉన్నా…ప్రతిపక్షం లో కూర్చున్నా…. నియోజకవర్గ సమస్యల గురించి పార్టీ అధ్యక్షుడు జగన్కు నేరుగా రిపోర్ట్ చేసే అవకాశం లేకుండా పోయిందని, అదే అతిపెద్ద సమస్య అంటున్నారట ఈ మాజీ.వాస్తవానికి 2024 ఎన్నికల ఫలితాలు మిగిలిన నియోజకర్గాలతో పోలిస్తే వాసుపల్లికి అతిపెద్ద షాక్. జనసేన పోటీ చేయడం, ప్రత్యర్ధి వంశీకృష్ణ పొరుగు నియోజకవర్గం నుంచి రావడం, రెండు సార్లు గెలిచిన తన అనుభవం అన్నీ కలిసొచ్చి స్వల్ప మెజారిటీతో అయినా.. బయటపడతానని అనుకున్నారట ఆయన.
కానీ… ఆ అంచనాలను తల్లకిందులు చేస్తూ… ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ 64వేలకు పైగా మెజార్టీతో గెలవడం చూసి వాసుపల్లి నిజంగానే షాకయ్యారన్నది లోకల్ వాయిస్. ఆ తర్వాతనే ఆయన పార్టీలోని అత్యంత కీలకమైన వ్యవస్థని టార్గెట్ చేస్తూ మాట్లాడటం యాధృచ్చికం కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. 2019లో టీడీపీ నుంచి గెలిచి ఏడాది కాలానికే జెండా పీకేశారు ఈ మత్స్యకార నేత. వైసీపీ అధినాయకత్వం సాదరంగా స్వాగతించినప్పటికీ నియోజకవర్గ రాజకీయాలు కంట్లో నలుసుగా మారాయట. అప్పటి వైసీపీ నేత, బ్రాహ్మణ కార్పొరే షన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ వర్సెస్ వాసుపల్లిగా వ్యవహారం నడిచేది. అప్పటి పార్టీ ముఖ్యనేత విజయ సాయిరెడ్డి ప్రమేయంతోనే తాను ఇబ్బంది పడాల్సి వచ్చిందన్న అభిప్రాయం ఆయనలో ఉందట. ఇక ఎన్నికలకు ముందు సుధాకర్ పార్టీ మారిపోయి దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ అయ్యారు. ఇక దక్షిణ నియోజకవర్గం వైసీపీలో తనకు ఇబ్బంది లేదనుకుంటున్న టైంలో చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు ఆయన స్వరం ఎందుకు మారిందన్న చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే ఆయన తిరిగి కూటమికి దగ్గరవుతారని అనుకున్నారు అంతా. గణేష్ కుమార్ మాత్రం ప్రాణం వున్నంత వరకు వైసీపీలోనేనని తేల్చేశారు. అలాంటప్పుడు ఈ అసంతృప్త స్వరం ఎందుకంటే… అందుకు వేరే బలమైన కారణాలున్నాయన్న విశ్లేషణలు నడుస్తున్నాయి. విశాఖ దక్షిణంలో బలపడేందుకు మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ కుటుంబం ప్రయత్నం చేస్తోందట. అలాగే… ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా యాక్టివేట్ అవుతున్నట్టు సమాచారం. వాళ్ళకు పార్టీలోని సీనియర్లు సహకరిస్తున్నారన్న అనుమానమే ఆయన అసహనానికి కారణం కావచ్చంటున్నారు. అందుకే కో ఆర్డినేటర్ వ్యవస్థను కూడా ప్రశ్నిస్తుండవచ్చన్నది ఓ వాదన. మొత్తం మీద వైసీపీలోని అత్యంత కీలకమైన వ్యవస్థ టార్గెట్గా వాసుపల్లి సంధించిన అసంతృప్తి అస్త్రం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.
Also Read
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Tags
- Ganesh
- NTV Telugu
- OTR
తాజావార్తలు
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్టాప్.. Kirin XE90 ప్రాసెసర్
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!