Off The Record: గన్నవరం పాలిటిక్స్ గరం గరం..! కొత్త మలుపు తిరగబోతోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: గన్నవరం నియోజకవర్గ రాజకీయాలు ఎప్పుడూ గరం గరంగానే ఉంటాయి. ఎన్నికల సమయంలోనే కాకుండా … ఆల్ ద టైం అక్కడ పొలిటికల్ హీట్ పుడుతూనే ఉంటుంది. ఇక ఆ సీజన్లో చెప్పే పనేలేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఇక ఏడాది టైం కూడా లేకపోవడంతో నియోజకవర్గ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. గన్నవరం నుంచి 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు వల్లభనేని వంశీ. వైసీపీ అధికారంలోకి వచ్చాక…. ఇక కష్టపడి సైకిల్ తొక్కడం ఎందుకు? హాయిగా ఫ్యాన్ కింద సేదదీరదామనుకుంటూ… గోడ దూకేశారు. అప్పటికే అధికార పార్టీ నుంచి నియోజకవర్గంలో కీలకంగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు.. వంశీ రాకను వ్యతిరేకించారు. కానీ… అప్పటికప్పుడు ఏం చేయలేక అసంతృప్తితో అలాగే ఉండిపోయారట. స్థానికంగా తన వర్గం ఉన్నా వారికి పార్టీ పదవులు గానీ.. స్థానిక ఎన్నికల్లో టికెట్లు గాని ఇప్పించుకోలేకపోవటంతో క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ వ్యవహారంపై అధిష్టానం దగ్గర చాలాసార్లు పంచాయితీ జరిగినా.. మార్పు రాలేదట.
అటు వైసీపీలో నేతల మధ్య వివాదాలు జరుగుతుంటే…. ఇటు టీడీపీకి ఇన్ఛార్జ్ కూడా లేని పరిస్థితి. దీంతో అధికార పార్టీకి టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావు ఈసారి టీడీపీ తరపున పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీని మీద సోషల్ మీడియా పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇంకో అడుగు ముందుకేసి… యార్లగడ్డ వెంకట్రావు పేరుతో బయటికి వచ్చిన పోస్టింగ్ కలకలం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో గన్నవరానికి మంచి రోజులు వస్తాయి, 2024లో ఏపీ మొత్తం మీద నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలుపుతానన్నది ఆ పోస్టింగ్ సారాంశం. అంటే ఈసారి యార్లగడ్డ టీడీపీ తరపున బరిలోకి దిగుతారనే సంకేతాలు ఇచ్చారా అన్న చర్చ జరుగుతోంది. అది ఫేక్ అకౌంట్ అని ఆయన ముఖ్య అనుచరులు చెబుతున్నా…యార్లగడ్డ మాత్రం మౌనంగానే ఉన్నారు. ఆ మౌనానికి అనేక అర్థాలు తీస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మౌనం అర్ధాంగీకారమేనా అన్న ప్రశ్న వస్తోంది. మరోవైపు యార్లగడ్డతో కొందరు టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అదలా ఉంచితే.. ఎవరో పెట్టిన పోస్టింగ్కి మేం ఎందుకు స్పందించాలన్నది వెంకట్రావు సన్నిహితుల మాట అట. వైసీపీ నుంచి వంశీకి టికెట్ కన్ఫామ్ అయితే… యార్లగడ్డకు ఉన్న ఆప్షన్ టీడీపీనే కాబట్టి సోషల్ మీడియాలో ప్రచారంపై ఆయన మౌనంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎట్నుంచి ఎటు మారతాయో చూడాలి.
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?