Off The Record: రగులుతున్న నంద్యాల టీడీపీ రాజకీయం.. అధిష్టానం మౌనం దేనికి సంకేతం.?
Off The Record: నంద్యాల జిల్లా టీడీపీలో అంతర్గతపోరు చల్లారకపోగా అంతకంతకూ పెరుగుతోంది. భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరులో భాగంగా జరుగుతున్న ఘటనలు అగ్గికి ఆజ్యం పోస్తున్నాయట. గతంలో భూమా, ఏవీ వర్గాల ఘర్షణలు, పరస్పరం కేసులు పెట్టుకున్నా, యువగళం పాదయాత్ర ఘర్షణ తరువాత మేటర్ ముదిరిపోయింది. సుబ్బారెడ్డి మరింత స్పీడ్ పెంచి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పట్టుకోసం పావులు కదుపుతున్నారన్నది లోకల్ టాక్.
దీని మీద భూమా వర్గం అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేసిందట.
Read Also: Off The Record: తెలంగాణ పెద్దల సభలో ఆ రెండు ఖాళీల భర్తీ జరగదా.?
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
నంద్యాలలో యువగళం పాదయాత్ర జరుగుతున్నప్పుడు అఖిల ప్రియకు సుబ్బారెడ్డి కాలు తగలడం, ఇద్దరి మధ్య మాట మాట పెరిగి సుబ్బారెడ్డిపై దాడి జరగడం అప్పట్లో పార్టీ పరంగా కలకలం రేపింది. పరస్పరం హత్యాయత్నం కేసులు పెట్టుకున్నారు. అధిష్టానం జోక్యంతో అప్పటికి రచ్చ పెరగకుండా ఆగినా….అఖిల ప్రియ అరెస్టయి జైలుకు వెళ్లి వచ్చాక ఇద్దరి మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఆ తర్వాతి నుంచే ఏవీ సుబ్బారెడ్డి… భూమా వర్గానికి వ్యతిరేకంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారట. గ్రామాల్లో తిరుగుతూ ముఖ్య నేతలను కలుస్తున్నారట. నంద్యాలలో తనపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఇందులో తప్పు ఎవరిదో చెప్పాలని మండల స్థాయి టీడీపీ నేతలతోపాటు సామాన్యులనూ ప్రశ్నిస్తున్నారట. ఆళ్లగడ్డలో బలపడడం ద్వారా ఈసారి టికెట్ తనకే ఇవ్వాలని టీడీపీ అధిష్టానంపై ఒత్తిడితెచ్చే వ్యూహంలో సుబ్బారెడ్డి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
Read Also: Off The Record: ఆ జిల్లా టీడీపీలో కొత్త నేతల హడావిడి మొదలైందా..?
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఏవీ సుబ్బారెడ్డి పర్యటనలపై అఖిలప్రియ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. తాను నియోజకవర్గ ఇంచార్జ్గా ఉన్నప్పుడు ఆయన ఎలా తిరుగుతారన్నది అఖిల క్వశ్చన్. అయితే ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేదు. పాదయాత్రలో ఘర్షణ పై టీడీపీ అధిష్టానం నియమించిన త్రీమెన్ కమిటీ నివేదిక ఇచ్చింది. దాని మీద కూడా మౌనంగానే ఉంది అధినాయకత్వం. ఇలా ప్రతి విషయంలోనూ… మౌనం దాల్చడంపై నంద్యాల టీడీపీలో చర్చ జరుగుతోందట. ఈ అగ్గి ఇలా రాజుకుంటూనే ఉంటే… ఎన్నికల ఏడాది మేమెలా పనిచేయాలని ఆందోళన పడుతున్నారట కార్యకర్తలు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!