IND vs ENG 2nd ODI: కటక్ వన్డేలో ఫ్లడ్లైట్ వైఫల్యంపై ఒడిశా సర్కార్ కఠిన చర్యలు..
- భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పని చేయని ఫ్లడ్ లైట్లు
- దాదాపు 30 నిమిషాల పాటు నిలిచిపోయిన మ్యాచ్
- బీసీసీఐని విపరీతంగా ట్రోల్ చేసిన క్రికెట్ ఫ్యాన్స్
- ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం సీరియస్.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఫ్లడ్ లైట్లు పని చేయకపోవడం వల్ల మ్యాచ్ దాదాపు 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో.. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో బీసీసీఐని విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో.. ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం సీరియస్ అయింది.. వెంటనే చర్యలు చేపట్టింది. మ్యాచ్ తర్వాత క్రీడా మంత్రి సూర్యవంశీ సూరజ్ ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (OCA)కి నోటీసు పంపారు. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు. నిజానికి, ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. తరువాత లాంగ్-ఆన్ బౌండరీకి అవతలి వైపు ఉన్న టవర్ పూర్తిగా ఆగిపోయే ముందు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంది. ఈ క్రమంలో క్రీజులో ఉన్న రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ డగౌట్కి వెళ్లారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లారు.
Read Also: Veera Raghava Reddy : రామరాజ్యం ఆర్మీ వీర రాఘవరెడ్డి అరెస్టు..
Also Read
- Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
- Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
- Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
ఓసీఏ వర్గాల సమాచారం ప్రకారం.. సాంకేతిక సమస్య కారణంగా జనరేటర్ పనిచేయడం ఆగిపోయింది. కొత్త జనరేటర్ను ఇన్స్టాల్ చేయడానికి సమయం పట్టింది. దీంతో.. ఆటగాళ్ళు, ప్రేక్షకులకు అసౌకర్యం కలిగించి మ్యాచ్ను దాదాపు 30 నిమిషాలు వాయిదా వేయాల్సి వచ్చింది. కాగా.. ఒడిశా క్రీడా శాఖ OCA కి జారీ చేసిన లేఖలో అంతరాయం కలిగించడానికి గల కారణాన్ని వివరణాత్మక వివరణ సమర్పించాలని, బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని OCA ని ఆదేశించింది.
Read Also: Ambati Rambabu: రాజకీయ లబ్ది కోసమే లడ్డూపై చంద్రబాబు ఆరోపణలు..
ఈ సందర్భంగా OCA కార్యదర్శి సంజయ్ బెహెరా ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. స్టేడియం పునరుద్ధరణకు సంబంధించి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో చర్చలు జరిగాయని తెలిపారు. 10 రోజుల్లోగా ఫ్లడ్లైట్లు పనిచేయకపోవడంపై సమాధానం ఇవ్వాలని ఒడిశా క్రికెట్ అసోసియేషన్ కోరిందని చెప్పారు. కాగా.. ఆటగాళ్ల బస్సు ఫ్లడ్లైట్ టవర్ దగ్గర ఆగి ఉండటంతో బ్యాకప్ జనరేటర్లు వెంటనే అక్కడికి చేరుకోలేకపోయాయని సంజయ్ బెహెరా తెలిపారు. ఆ సమయంలో బస్సులో డ్రైవర్ లేడని.. అతన్ని పిలిచి వాహనాన్ని తీయాలని చెప్పామన్నారు. ఆ తర్వాత జనరేటర్ టవర్ వద్దకు చేరుకుని విద్యుత్తును పునరుద్ధరించామని బెహెరా చెప్పారు. కాగా.. ఇలాంటి సంఘటనలు గతంలో చాలాసార్లు స్టేడియంలో జరిగాయి.
తాజావార్తలు
-
Mahabubabad: దారుణం.. ఇద్దరు కుమారులకు ఉరేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి..
-
Ashwini Vaishnaw: విశాఖపట్నం ఇక ఏఐపట్నం.. దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి న్యాయం.. అమరావతి నుంచి త్వరలోనే బుల్లెట్ ట్రైన్..
-
Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
-
Crime: ఇదేం దారుణం రా నాయనా.. బస్సు ఎక్కడికి వెళ్తుందని అడిగినందుకు వృద్ధుడి హత్య..
-
Ashu Reddy: హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి ..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!