IND vs ENG 2nd ODI: కటక్ వన్డేలో ఫ్లడ్లైట్ వైఫల్యంపై ఒడిశా సర్కార్ కఠిన చర్యలు..
- భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పని చేయని ఫ్లడ్ లైట్లు
- దాదాపు 30 నిమిషాల పాటు నిలిచిపోయిన మ్యాచ్
- బీసీసీఐని విపరీతంగా ట్రోల్ చేసిన క్రికెట్ ఫ్యాన్స్
- ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం సీరియస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్లో ఫ్లడ్ లైట్లు పని చేయకపోవడం వల్ల మ్యాచ్ దాదాపు 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో.. క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో బీసీసీఐని విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో.. ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం సీరియస్ అయింది.. వెంటనే చర్యలు చేపట్టింది. మ్యాచ్ తర్వాత క్రీడా మంత్రి సూర్యవంశీ సూరజ్ ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (OCA)కి నోటీసు పంపారు. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరారు. నిజానికి, ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో భారత్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. తరువాత లాంగ్-ఆన్ బౌండరీకి అవతలి వైపు ఉన్న టవర్ పూర్తిగా ఆగిపోయే ముందు వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంది. ఈ క్రమంలో క్రీజులో ఉన్న రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ డగౌట్కి వెళ్లారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు కూడా గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లారు.
Read Also: Veera Raghava Reddy : రామరాజ్యం ఆర్మీ వీర రాఘవరెడ్డి అరెస్టు..
Also Read
- Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
ఓసీఏ వర్గాల సమాచారం ప్రకారం.. సాంకేతిక సమస్య కారణంగా జనరేటర్ పనిచేయడం ఆగిపోయింది. కొత్త జనరేటర్ను ఇన్స్టాల్ చేయడానికి సమయం పట్టింది. దీంతో.. ఆటగాళ్ళు, ప్రేక్షకులకు అసౌకర్యం కలిగించి మ్యాచ్ను దాదాపు 30 నిమిషాలు వాయిదా వేయాల్సి వచ్చింది. కాగా.. ఒడిశా క్రీడా శాఖ OCA కి జారీ చేసిన లేఖలో అంతరాయం కలిగించడానికి గల కారణాన్ని వివరణాత్మక వివరణ సమర్పించాలని, బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని OCA ని ఆదేశించింది.
Read Also: Ambati Rambabu: రాజకీయ లబ్ది కోసమే లడ్డూపై చంద్రబాబు ఆరోపణలు..
ఈ సందర్భంగా OCA కార్యదర్శి సంజయ్ బెహెరా ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. స్టేడియం పునరుద్ధరణకు సంబంధించి ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో చర్చలు జరిగాయని తెలిపారు. 10 రోజుల్లోగా ఫ్లడ్లైట్లు పనిచేయకపోవడంపై సమాధానం ఇవ్వాలని ఒడిశా క్రికెట్ అసోసియేషన్ కోరిందని చెప్పారు. కాగా.. ఆటగాళ్ల బస్సు ఫ్లడ్లైట్ టవర్ దగ్గర ఆగి ఉండటంతో బ్యాకప్ జనరేటర్లు వెంటనే అక్కడికి చేరుకోలేకపోయాయని సంజయ్ బెహెరా తెలిపారు. ఆ సమయంలో బస్సులో డ్రైవర్ లేడని.. అతన్ని పిలిచి వాహనాన్ని తీయాలని చెప్పామన్నారు. ఆ తర్వాత జనరేటర్ టవర్ వద్దకు చేరుకుని విద్యుత్తును పునరుద్ధరించామని బెహెరా చెప్పారు. కాగా.. ఇలాంటి సంఘటనలు గతంలో చాలాసార్లు స్టేడియంలో జరిగాయి.
తాజావార్తలు
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!