N.V Ramana : వెంటాడి మరీ నాకు సన్మానం చేశారు ఎందుకో అర్ధం కాలేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పదవిలో ఉన్నప్పుడు సన్మానం చేయడం సహజమని, నేను పదవి విరమణ చేసి సంవత్సరం దాటింది అయినా నాకు సన్మానం చేశారని, వెంటాడి మరీ నాకు సన్మానం చేశారు ఎందుకో అర్ధం కాలేదన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. ఇవాళ ఆయన కు ఖమ్మంలో జిల్లాలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు నాకు అవినాభావ సంబంధం ఉందని, నా చిన్ననాటి స్నేహితులు ఇక్కడ ఉన్నారన్నారు. నేను గతంలో ఖమ్మం వచ్చి మూడు భవనాలకు శంఖుస్థాపన చేసి వెళ్ళానని ఆయన తెలిపారు. ఆ పని ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. భారత దేశంలో న్యాయ వ్యవస్థకు ప్రాదాన్యత లేదని ఆ రోజు అర్ధం అయిందని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. ఈ జిల్లా నుంచి ముగ్గురు న్యాయమూర్థులను తయారు చేసానన్నారు. ఖమ్మం కు ఉద్యమాల జిల్లా,ఉద్యమాల ఖిల్లా,పోరాటాల గడ్డ,పోరాటాల బావుటా అనే పేర్లు ఉన్నాయని, పుచ్చలపల్లి గారు రాసిన పుస్తకాలు చదివితే ఇక్కడ కలియ తిరిగినట్లే ఉంటుందన్నారు.
అంతేకాకుండా.. ‘కమ్యూనిష్టు పార్టీ నాయకులు మా ఇంట్లో ఉండి సాయుద పోరాటాలు చేశారు…. నిజాం నిరంకుశ పాలన కు వ్యతిరేకంగా పోరాడారు…. మా నాన్న గారు ఎన్నో పోరాటాల గూర్చి మాకు చెప్పేవారు…. ఎంతోమంది కమ్యూనిష్టు నాయకులు ఖమ్మం లో ఉన్నారు…. బోడెపుడి, మంచికంటి,శీలం సిద్దారెడ్డి, జలగం వెంగళరావు,రజాబ్ అలీ లాంటి మేధావులను కన్న గడ్డ ఇది…. అలనాటి నాయకులను మర్చిపోకూడదు…. ఎంత ఎత్తుకు ఎదిగినా పుట్టిన గడ్డను మర్చిపోవద్దు… మంత్రి తుమ్మల సమర్డత నాకు తెలుసు…. ఆయన ఉంటే అభివృద్ధి ఉన్నట్టే…. మాలాగే ఇక్కడ కూడా మెట్ట భూములు…. అందుకే పారిశ్రామిక రంగంలో దూసుకుపోతుంది…. నిజాయితీ గల రాజకియ నాయకులు ఉన్న ప్రాంతం ఇది… మహాకవి దాశరధి కవితలు ఆమోఘం…. కిన్నెరసాని నది చరిత్ర ఎంతో గొప్పది… భక్తరామదాసు పుట్టిన నేల ఇది… సితమ్మ చీర ఆనవాళ్ళున్న ప్రాంతం ఇది…. నేటి యువత కు ఓ సందేశం…. అభివృద్ధి,లక్షల్లో జీతం,ఎదుగుదల అవసరమే…. కానీ సామాజిక సేవ కూడా అవసరమే…కానీ, చేయట్లేదు…. ధనికులు పేదలకు మధ్య అంతరాయం ఏర్పడుతుంది…. పక్కింటి వాడు కూడా ఎదిగేలాగా మనం సహకరించాలి….. పేదరికం వల్ల అశాంతి వస్తుంది….. సమాజ స్పృహ అవసరం…. దేశమంటే మట్టి కాదోయ్ అనే పద్యం పాడిన జస్టిస్…. మాతృభాష అంతరించే ప్రమాదం ఉంది…. సంస్కృతి,సాంప్రదాయం బ్రతకాలి…. ఆంగ్ల భాష అవసరమే కానీ మాతృ భాష ను మరిచిపోవద్దు…. ఏ దేశం వెళ్లినా మూలాలు మర్చిపోవద్దు…. జన్మనిచ్చిన తల్లిదండ్రులను,గ్రామాన్ని,స్నేహితులను మర్చిపోవద్దు…. నీ గొప్ప తనాన్ని చెప్పుకునేది నీ గ్రామంలోనే…. అమ్మను మరవద్దు,అమ్మభాషను మరవద్దు… కొంతైనా త్యాగం అవసరం..’ అని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.
Also Read
- Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
- CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
- CJI Surya Kant: ‘‘నకిలీ డిగ్రీలతో వ్యవస్థను చెడగొడుతున్నారు’’.. కాక్రోచ్ వ్యాఖ్యలపై సీజేఐ క్లారిటీ
తాజావార్తలు
-
Mamata Banerjee: ఉంటే.. ఉండండి.. లేకపోతే వెళ్లిపోండి.. జంపింగ్లకు మమత సందేశం
-
Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
-
Peddi First Review: 3 గంటల ఊర మాస్ జాతర.. సినిమాలో అదే అసలు హైలైట్
-
CM Vijay: తమిళనాడు కొత్త కేబినెట్ ప్రకటించిన విజయ్.. ఎవరికి ఏ శాఖ?
-
Ponguleti Srinvias Reddy : తెలంగాణలో ఇళ్లు లేని వారికి గుడ్న్యూస్ చెప్పిన మంత్రి పొంగులేటి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..