టాలీవుడ్ సినిమాల పరిస్థితి ఏమంత ఆశించినంతగా లేదు. చిన్న, మిడ్ రేంజ్ హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు ఓటీటీ డీల్స్ ఇదివరటిలా జరగడం లేదు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్స్ తమ పాలసీలను మార్చుకుని, సినిమాల కొనుగోలు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. అయినప్పటికీ, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబోకు ఉన్న డిమాండ్ దృష్ట్యా, ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ను కళ్ళు చెదిరే ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం.
Also Read : Peddi Overseas Rights : పెద్ది ఓవర్సీస్ రైట్స్.. చరణ్ కెరీర్లోనే రికార్డ్ డీల్
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం డ్రాగన్ ఓటీటీ రైట్స్ దాదాపు రూ. 140 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఆల్ లాంగ్వేజెస్ కలిపి ఈ డీల్ ఇంకా పెద్ద మొత్తంలోనే ఉండొచ్చని అంచనా. ఓటీటీ మార్కెట్లో కొత్త నిబంధనల మధ్య కూడా ఈ రేంజ్ డీల్ జరగడం తారక్ గ్లోబల్ స్టార్డమ్కు నిదర్శనమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ డీల్లో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. సినిమా థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం జోర్డాన్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాలోని కీలకమైన యాక్షన్ సీన్స్ ను అక్కడ షూట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ నటుడు టోవినో థామస్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి రవి బాసృర్ సంగీతం అందిస్తుండగా జూన్ 25, 2026న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.