ఇంజనీరింగ్ చదివారా ?అయితే మీకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇప్పటికే పలు సంస్థల్లో పలు శాఖల్లో ఉన్న ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తూ వస్తుంది.. తాజాగా మరో సంస్థలో ఉండే ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం .. మొత్తం 63 పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. ఈ పోస్టులకు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఏప్రిల్ 13 దరఖాస్తులకు చివరితేది.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ https://ntpcrel.co.in/ వెబ్సైట్ చూడొచ్చు.. ఒకసారి అర్హతలు ,ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి తెలుసుకుందాం..
మొత్తం పోస్టులు .. 63
ఇంజినీర్ (ఆర్ఈ-సివిల్) పోస్టులు: 20
ఇంజినీర్ (ఆర్ఈ-ఎలక్ట్రానికల్) పోస్టులు: 29
ఇంజినీర్ (ఆర్ఈ-మెకానికల్) పోస్టులు: 09
ఎగ్జిక్యూటివ్ (ఆర్ఈ-హెచ్ఆర్) పోస్టులు: 01
ఇంజినీర్ (ఆర్ఈ-సీడిఎం) పోస్టులు: 01
ఎగ్జిక్యూటివ్ (ఆర్ఈ-పైనాన్స్) పోస్టులు: 01
ఇంజినీర్ (ఆర్ఈ-ఐటీ) పోస్టులు: 01
ఎగ్జిక్యూటివ్ (ఆర్ఈ-కార్పొరేట్ కమ్యూనికేషన్) పోస్టులు : 01
అర్హతలు ..
ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ/ బీటెక్, పీజీ, సీఏ/ సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి..
అభ్యర్థులకు 30 ఏళ్లు మించరాదు.
జీతం..
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు జీతం విషయానికొస్తే.. నెలకు రూ.83,000గా నిర్ణయించారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు..
రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 21, 2024
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 13, 2024
అర్హత , ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ను బాగా చదివి అప్లై చేసుకోవడం మంచిది..