JEE Mains 2025: నేటి నుంచే JEE మెయిన్స్ 2025 సెషన్ 2 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
- JEE మెయిన్స్ 2025 సెషన్ 2 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు.
- నేటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JEE Mains 2025: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) JEE మెయిన్ 2025 సెషన్ 2 పరీక్ష కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈ రోజు (జనవరి 31) నుండి ప్రారంభించింది. విద్యార్థులు ఈ సెషన్ 2 పరీక్షలో హాజరయ్యేందుకు 24 ఫిబ్రవరి 2025 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియను jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. JEE మెయిన్ 2025 సెషన్ 1 పరీక్షను జనవరి 22 నుంచి జనవరి 30 వరకు నిర్వహించారు. సెషన్ 1 కోసం దరఖాస్తు ప్రక్రియ 28 అక్టోబర్ 2024 నుంచి ప్రారంభమై 22 నవంబర్ 2024 వరకు కొనసాగింది. దరఖాస్తు చేసిన విద్యార్థులకు 3 రోజుల ముందుగానే అడ్మిట్ కార్డులు జారీ చేయబడినాయి.
Also Read: Champions Trophy 2025: పీసీబీకి మరో తలనొప్పి.. తొలగించడం లేదంటూ వివరణ!
Also Read
- Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
- Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
- Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
- Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
JEE మెయిన్ 2025 సెషన్ 2 కోసం దరఖాస్తు ఎలా చేయాలన్న విషయానికి వస్తే.. మొదటగా jeemain.nta.nic.in అధికారిక వెబ్సైట్కి వెళ్లండి. అక్కడ హోమ్ పేజీలో ఉన్న JEE మెయిన్ 2025 రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేయండి. ఆపై మీ మొబైల్ నంబర్, మెయిల్ ఐడిని నమోదు చేయండి. అప్లికేషన్ ఫారమ్ను పూర్తిగా పూరించి, ఆ తర్వాత సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయండి. ఆ తర్వాత దరఖాస్తు రుసుము చెల్లించి అప్లికేషన్ ను సమర్పించండి.
Also Read: AkankshaSharma : టాలీవుడ్ లో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ
ఇక JEE మెయిన్ 2025 సెషన్ 2 పరీక్ష NTA ప్రకారం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 8 వరకు నిర్వహించబడుతుంది. అయితే, పరీక్షకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. పరీక్షా అడ్మిట్ కార్డ్ 3 రోజులు ముందు జారీ చేయబడుతుంది. గత సంవత్సరం సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 4 – 15 మధ్య నిర్వహించబడింది. విద్యార్థులు మరింత సమాచారం కోసం NTA విడుదల చేసిన నోటిఫికేషన్ను తనిఖీ చేయవచ్చు. సెషన్ 1 పరీక్షకు హాజరైన విద్యార్థులు కూడా సెషన్ 2 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Beijing: బీజింగ్లో ఎత్తైన భవనాన్ని ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్
-
Bhatti Vikramarka : డ్రగ్స్పై భట్టి వార్నింగ్.. ఎంతటి వారైనా వదిలేదే లేదు.!
-
Red Chili Test: వంటగదిలో వాడే ఎండు మిర్చి కారం నకిలీదా..? అసలుదా..? సింపుల్గా తెలుసుకోండిలా..
-
Britain Heatwave: భారత్లో 45°C ఉన్నా ఏం కాదు.. బ్రిటన్లో 35°Cకే ప్రజలు ఎందుకు అల్లాడుతున్నారు?
-
NBK 112: కొరటాల సినిమా కోసం రూల్స్ బ్రేక్ చేసిన బాలయ్య
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!