Delhi Hotel: మాములోడు కాదు.. రెండేళ్లు ఫైవ్ స్టార్ హోటల్లో ఉండి.. బిల్లు కట్టకుండానే జంప్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Hotel: మనం సాధారణంగా హోటల్ కు వెళ్తే.. మనం ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ ఐటమ్స్ తిని బిల్లు కట్టి వచ్చేస్తాం. లేదంటే హోటల్ యాజమన్యం మనల్ని డబ్బులు ఇచ్చేదాకా వదలిపెట్టదు. అలాంటిది ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఓ వ్యక్తి బిల్లు కట్టకుండా బయటపడ్డాడు. సరే లే అని వదిలిపెట్టేద్దాం అనుకుంటే.. ఒక్క రోజా రెండు రోజులా ఉండలేదు. దాదాపు 603 రోజులు ఉండి డబ్బులు కట్టకుండానే ఉడాయించాడు. అక్షరాల రూ.58 లక్షల బిల్ ఎగ్గొట్టాడు ఈ చీటర్.
Read Also: SBI: గుడ్న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. ఆగస్టు 15 వరకు అవకాశం..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్ పోర్టుకి దగ్గర్లో ఉన్న ఫైవ్ స్టార్ హోటల్ లో అంకుశ్ దత్త అనే వ్యక్తి 2019 మే 30వ తేదీన ఫస్ట్ టైమ్ దిగాడు. ఒక్కరాత్రికి బుక్ చేసుకున్న ఆ వ్యక్తి.. మరుసటి రోజు చెకౌట్ చేయాలి. కానీ అప్పటినుంచి ఎక్స్ టెండ్ చేస్తూ.. 2021 జనవరి 22 వరకూ అక్కడే ఉన్నాడు. అయితే హోటల్కి ఎవరు వచ్చినా 72 గంటల్లో బిల్ కట్టకపోతే.. ఆ విషయం వెంటనే సీఈవో వరకూ వెళ్తుంది. అయితే.. ఫ్రంట్ ఆఫీస్ హెడ్ మాత్రం ఇది ఎవరి దృష్టికీ వెళ్లకుండా మేనేజ్ చేశాడు. మరో ట్విస్ట్ ఏంటంటే.. నిందితుడు దత్త హోటల్కి మొత్తం మూడు చెక్స్ ఇచ్చాడు. రూ.10 లక్షలు, రూ.7 లక్షలు, రూ.20 లక్షల చెక్లు ఇవ్వగా.. అవన్నీ బౌన్స్ అయ్యాయి. ఆ విషయం కూడా పై అధికారులకు తెలియదు.
Read Also: Ambati Rambabu: పవన్ వారాహి మీద కాదు పంది మీద ఎక్కాడు.. 420లా తయారయ్యాడు.. మంత్రి సంచలనం!
మరోవైపు ఆ చీటర్ పారిపోవడానికి హోటల్ ఫ్రంట్ ఆఫీస్ హెడ్ ప్రేమ్ ప్రకాశ్.. సహకరించినట్టు హోటల్ ఓనర్ ఆరోపించాడు. హోటల్లో ఎవరెవరు ఉంటారన్నా విషయం..? ఎవరెవరికి యాక్సెస్ ఉంది అనేది పూర్తిగా ప్రేమ్ ప్రకాశ్ కు తెలుస్తుందన్నాడు. అతని సహకారం లేకుండా నిందితుడు అన్ని రోజులు హోటల్లో ఉండే అవకాశమే లేదని చెబుతున్నాడు. ఓవర్ స్టే చేసేందుకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి ఉంటాడని అనుమానిస్తున్నాడు. అంతేకాకుండా ఎవరికి తెలియకుండా హోటల్ సాఫ్ట్వేర్ని కూడా తన ఆధీనంలో ఉంచుకొని.. ఈ నేరానికి పాల్పడ్డారని చెబుతున్నాడు హోటల్ యజమాని మల్హోత్రా. అయితే ఈ ఇద్దరి నిందితులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని హోటల్ యాజమాన్యం చూస్తోంది. ప్రాథమిక విచారణలో నిందితులెవరో గుర్తించామని, విచారణ పూర్తైన తరవాత తప్పకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!