Jio Nokia: జియో-నోకియా మధ్య కీలక ఒప్పందం.. మార్కెట్ మామూలుగా ఉండదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Nokia: జియో 5జీ నెట్ వర్క్ విస్తరించేందుకు నిర్మాణ ప్రాజెక్ట్ను నోకియా సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య కొన్నేళ్లకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని నోకియా సంస్థ సోమవారం ప్రకటించింది. దేశంలో 5జీ నెట్వర్క్ను విస్తరించేందుకు పరికరాల కోసం నోకియాతో జియో చేతులు కలిపింది. 5జీ రేడియో యాక్సెస్ పరికరాలను జియోకు నోకియా సరఫరా చేయనుంది. దీంట్లో భాగంగా రిమోట్ రేడియో హెడ్స్, బేస్ స్టేషన్స్, 5జీ ఎంఐఎంఓ యాంటెనాలను ఇవ్వనుంది.
Read Also: Wife Exchange:‘వైఫ్ స్వాపింగ్’ గేమ్కు ఒప్పుకోలేదని కీచకుడిగా మారిన భర్త
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ఈనెలలోనే దేశంలోని 4 నగరాల్లో 5జీ నెట్వర్క్ బీటా సర్వీస్లను జియో లాంచ్ చేసింది. త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించేందుకు రెడీ అయింది. ఇదే క్రమంలో దేశమంతా 5జీ నెట్వర్క్ను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రచిస్తోంది. ఇందుకోసం కీలకమైన భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంది. 5జీ నెట్వర్క్ విస్తరణకు అవసరమైన పరికరాల కోసం టెలికం ఎక్యూప్మెంట్ మేకర్, ప్రముఖ సంస్థ నోకియా, స్వీడన్కు చెందిన ఎరిక్సన్తో భాగస్వామ్యాన్ని జియో కుదుర్చుకుంది.
Read Also: Congress : కొత్త అధ్యక్షుడిగా ఖర్గే ఎన్నిక ఖాయం.. కాంగ్రెస్ వర్గాలు
అలాగే 5జీ స్టాండలోన్ కోసం ఎరిక్సన్తో జియో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎరిక్సన్ రేడియో సిస్టమ్, ఈ-బ్యాండ్ మైక్రోవేవ్ మొబైల్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్, రేడియో యాక్సెస్ నెట్వర్క్ ప్రొడక్టులను జియోకు అందించనున్నట్టు ఎరిక్సన్ పేర్కొంది. ఇండియా డిజిటలైజేషన్ను జియో 5జీ నెట్వర్క్ మరింత వేగవంతం చేయగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసి సిటీల్లో జియో ట్రూ 5జీనిటెస్టింగ్లో భాగంగా లాంచ్ చేసింది. జియో 5జీని పొందేందుకు యూజర్లు కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 4జీ సిమ్ 5జీకి కూడా సపోర్ట్ చేస్తుంది. 5జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే ఫోన్ ఉండాలి. డిసెంబర్ 2023 కల్లా దేశమంతా 5జీ నెట్ వర్క్ విస్తరించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!