Jio Nokia: జియో-నోకియా మధ్య కీలక ఒప్పందం.. మార్కెట్ మామూలుగా ఉండదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jio Nokia: జియో 5జీ నెట్ వర్క్ విస్తరించేందుకు నిర్మాణ ప్రాజెక్ట్ను నోకియా సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య కొన్నేళ్లకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని నోకియా సంస్థ సోమవారం ప్రకటించింది. దేశంలో 5జీ నెట్వర్క్ను విస్తరించేందుకు పరికరాల కోసం నోకియాతో జియో చేతులు కలిపింది. 5జీ రేడియో యాక్సెస్ పరికరాలను జియోకు నోకియా సరఫరా చేయనుంది. దీంట్లో భాగంగా రిమోట్ రేడియో హెడ్స్, బేస్ స్టేషన్స్, 5జీ ఎంఐఎంఓ యాంటెనాలను ఇవ్వనుంది.
Read Also: Wife Exchange:‘వైఫ్ స్వాపింగ్’ గేమ్కు ఒప్పుకోలేదని కీచకుడిగా మారిన భర్త
Also Read
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
ఈనెలలోనే దేశంలోని 4 నగరాల్లో 5జీ నెట్వర్క్ బీటా సర్వీస్లను జియో లాంచ్ చేసింది. త్వరలోనే మరిన్ని నగరాలకు విస్తరించేందుకు రెడీ అయింది. ఇదే క్రమంలో దేశమంతా 5జీ నెట్వర్క్ను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళిక రచిస్తోంది. ఇందుకోసం కీలకమైన భాగస్వామ్యాలను ఏర్పరుచుకుంది. 5జీ నెట్వర్క్ విస్తరణకు అవసరమైన పరికరాల కోసం టెలికం ఎక్యూప్మెంట్ మేకర్, ప్రముఖ సంస్థ నోకియా, స్వీడన్కు చెందిన ఎరిక్సన్తో భాగస్వామ్యాన్ని జియో కుదుర్చుకుంది.
Read Also: Congress : కొత్త అధ్యక్షుడిగా ఖర్గే ఎన్నిక ఖాయం.. కాంగ్రెస్ వర్గాలు
అలాగే 5జీ స్టాండలోన్ కోసం ఎరిక్సన్తో జియో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎరిక్సన్ రేడియో సిస్టమ్, ఈ-బ్యాండ్ మైక్రోవేవ్ మొబైల్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్, రేడియో యాక్సెస్ నెట్వర్క్ ప్రొడక్టులను జియోకు అందించనున్నట్టు ఎరిక్సన్ పేర్కొంది. ఇండియా డిజిటలైజేషన్ను జియో 5జీ నెట్వర్క్ మరింత వేగవంతం చేయగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ, ముంబై, కోల్కతా, వారణాసి సిటీల్లో జియో ట్రూ 5జీనిటెస్టింగ్లో భాగంగా లాంచ్ చేసింది. జియో 5జీని పొందేందుకు యూజర్లు కొత్త సిమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 4జీ సిమ్ 5జీకి కూడా సపోర్ట్ చేస్తుంది. 5జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేసే ఫోన్ ఉండాలి. డిసెంబర్ 2023 కల్లా దేశమంతా 5జీ నెట్ వర్క్ విస్తరించాలని జియో లక్ష్యంగా పెట్టుకుంది.
తాజావార్తలు
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..