Delhi Liquor Scam: మనీష్ సిసోడియాకు లభించని ఊరట.. బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Liquor Scam: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విడివిడిగా విచారిస్తున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారించిన కేసులో సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 4కి వాయిదా వేసింది. తన భార్య అనారోగ్య కారణాలతో సిసోడియా మధ్యంతర బెయిల్ను కోరారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారనే కారణంతో మనిష్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం పలుమార్లు సిసోడియా కోర్టు మెట్లు ఎక్కినప్పటికీ ఆయనకు మాత్రం ఊరట లభించడం లేదు.
Also Read: RTC Bill: ఆర్టీసి బిల్లును సిద్ధం చేసిన సర్కార్.. ఆమోదం తెలుపని గవర్నర్..!
Also Read
- Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
- Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
- Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
- CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సిసోడియా భార్య వైద్య రికార్డులను పరిశీలించింది. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని.. అందువల్ల, ఈ కేసులలో సాధారణ బెయిల్ పిటిషన్లతో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి మధ్యంతర బెయిల్ పిటిషన్లను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. కోర్టులో సిసోడియా తరపున వాదించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సిసోడియా భార్య ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి గురించి ధర్మాసనానికి తెలియజేశారు. “ఇది ప్రోగ్రెసివ్ డిసీజ్. రిలాప్స్ ఉన్నాయి. ఆమె ఏప్రిల్ నుంచి ఆసుపత్రిలో ఉంది,” అని కోర్టుకు విన్నవించారు. సిసోడియా భార్య అంతకన్నా తల్లితో జీవిస్తోందని, ఆమె కుమారుడు అమెరికాలో ఉంటున్నాడని ఆయన చెప్పారు. “ఆమెను చూసుకోవడానికి అతన్ని (సిసోడియా) రెండు వారాల పాటు ఇంటికి వెళ్లనివ్వండి” అని సింఘ్వీ అన్నారు.దీనికి జస్టిస్ ఖన్నా బదులిస్తూ.. రెగ్యులర్ బెయిల్ విన్నప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు.
జూలై 14న సిసోడియా మధ్యంతర బెయిల్ పిటిషన్లపై సీబీఐ, ఈడీల స్పందనను సుప్రీంకోర్టు కోరింది. ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఎక్సైజ్ పాలసీ పై లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా గతేడాది సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. సిసోడియాతో పాటు పలువురిపై అవినీతి ఆరోపణలు చేశారు. సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో ఈడీ కూడా రంగంలోకి దిగింది. లిక్కర్ పాలసీ లోని ఆర్థిక అవకతవకలపై ప్రత్యేకంగా కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. ఉప ముఖ్యమంత్రిగా ఎక్సైజ్ శాఖను కలిగి ఉన్న సిసోడియాను ఫిబ్రవరి 26న “స్కామ్”లో పాత్ర పోషించినందుకు సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి సిసోడియా కస్టడీలోనే ఉన్నారు. మార్చి 9న తీహార్ జైలులో విచారించిన తర్వాత సీబీఐ ఎఫ్ఐఆర్లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. ఫిబ్రవరి 28న ఢిల్లీ మంత్రివర్గం నుంచి సిసోడియా రాజీనామా చేశారు. సిసోడియా ఉపముఖ్యమంత్రిగా, ఎక్సైజ్ మంత్రిగా ఉంటూ సాక్షులను ప్రభావితం చేసే సత్తా ఉన్న “అత్యున్నత స్థాయి” వ్యక్తి అని పేర్కొంటూ మే 30న సీబీఐ కేసులో సిసోడియా బెయిల్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. జూలై 3న, నగర పాలక సంస్థ యొక్క ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అతనిపై అభియోగాలు “చాలా తీవ్రమైనవి” అని పేర్కొంటూ హైకోర్టు అతనికి బెయిల్ నిరాకరించింది. ఆరోపించిన కుంభకోణం జరిగినప్పుడు సిసోడియా వ్యవహారాల సారథ్యంలో ఉన్నందున, అతనికి ఎలాంటి పాత్ర లేదని చెప్పలేమని హైకోర్టు మే 30న తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజావార్తలు
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
-
Konda Surekha : ‘నన్ను అణచేస్తున్నారు’.. రాహుల్కు సురేఖ ఫిర్యాదు.!
-
Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
-
Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
-
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!