Uddhav Thackeray: రామ మందిర వేడుకలకు ఆహ్వానం లేదు.. ఆ రోజు ఏం చేయబోతున్నారో చెప్పిన సీనియర్ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపించింది ఆలయ కమిటి. అయితే ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ ఠాక్రే. అయితే ఆరోజుకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే ఏమి చేయబోతున్నారో తన ప్రణాళికను చెప్పారు. ఆ రోజు నాసిక్లోని కాలారం ఆలయాన్ని తాను, తన పార్టీ నేతలు సందర్శించి గోదావరి నది ఒడ్డున మహా హారతి చేస్తారని ఉద్ధవ్ చెప్పారు.
తన తల్లి దివంగత మీనా ఠాక్రే జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ.. తనకు ఇష్టం వచ్చినప్పుడు అయోధ్యకు వస్తానని చెప్పారు. అయోధ్య రామ మందిరాన్ని ప్రతిష్టించడం గర్వకారణం, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయమని తెలిపారు. ఆ రోజు (జనవరి 22) సాయంత్రం 6.30 గంటలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, (సంఘ సంస్కర్త) సానే గురూజీ కలరామ్ ఆలయానికి వెళ్తామని ఠాక్రే అన్నారు. రాత్రి 7.30 గంటలకు గోదావరి నది ఒడ్డున మహా హారతి నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Also Read
Read Also: Animal Actor: ‘సూసైడ్’కి యత్నించిన యువతిని హీరోలా కాపాడిన ‘యానిమల్’ నటుడు
తన తండ్రి, శివసేన వ్యవస్థాపకుడు దివంగత బాల్ ఠాక్రే జయంతి రోజైన జనవరి 23న నాసిక్లో పార్టీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. గత శనివారం.. ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ, “నాకు ఇంకా ఎటువంటి ఆహ్వానం అందలేదు. అయోధ్యకు రావాలని నాకు ఎటువంటి ఆహ్వానం అవసరం లేదు, ఎందుకంటే రామ్ లల్లా అందరికీ చెందినవాడు, నాకు ఎప్పుడు వెళ్లాలనిపిస్తే, అప్పుడు వెళ్తాను”. అని అన్నారు.
నాసిక్లోని పంచవటి ప్రాంతంలో ఉన్న కలరామ్ ఆలయం రాముడికి అంకితం చేశారు. నల్లరాతితో చేసిన రాముడి విగ్రహం నుండి ఈ ఆలయానికి పేరు వచ్చింది. వనవాస సమయంలో శ్రీరాముడు తన భార్య సీత, సోదరుడు లక్ష్మణుడితో పంచవటిలో ఉండేవాడని నమ్ముతారు. కాగా.. 1930లో డాక్టర్ అంబేద్కర్ దళితులను కాలారామ్ ఆలయంలోకి ప్రవేశించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు నాయకత్వం వహించారు.
Read Also: Software Engineer Safe: హైదరాబాద్ లో కిడ్నాపైన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సేఫ్..
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!