World Cup 2023: హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఖాళీ స్టేడియంలోనే ప్రపంచకప్ మ్యాచ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
World Cup 2023 PAK vs NZ Warm-Up Match in Hyderabad to be played behind closed doors: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా హైదరాబాద్ నగరంలో భారత్ మ్యాచ్లు లేకపోవడంతో భాగ్యనగర క్రికెట్ ఫాన్స్ ఇప్పటికే నిరాశలో ఉన్న విషయం తెలిసిందే. అసలే బాధలో ఉన్న హైదరాబాద్ ఫ్యాన్స్కు మరో షాక్ తగిలింది. సెప్టెంబర్ 29న ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రపంచకప్ తొలి వామప్ మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించకూడదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ), బీసీసీఐ నిర్ణయించింది. సెప్టెంబర్ 29న ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్, న్యూజిలాండ్ ప్రాక్టీస్ మ్యాచ్ జరగనుంది.
పాకిస్థాన్, న్యూజిలాండ్ ప్రాక్టీస్ మ్యాచ్కు ఒకరోజు ముందు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండగలు ఉన్నాయి. దాంతో ఈ మ్యాచ్కు భద్రత కల్పించలేమని హైదరాబాద్ పోలీసులు హెచ్సీఏకు ఇదివరకే తెలిపారు. పాక్-కివీస్ వామప్ మ్యాచ్ తేదీని మార్చుకోవాల్సిందిగా హెచ్సీఏకు హైదరాబాద్ పోలీసులు సూచించారు. ఈ విషయాన్ని బీసీసీఐ దృష్టికి హెచ్సీఏ తీసుకెళ్లింది. ప్రధాన మ్యాచ్ కాదు కాబట్టి.. తేదీ మార్చాల్సిన అవసరం లేదని బీసీసీఐ నిర్ణయించింది. ఖాళీ స్టేడియంలో ఈ ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించాలని బీసీసీఐ పెద్దలు సూచించినట్లు హెచ్సీఏ వ్యవహారాలు చూస్తున్న జస్టిస్ లావు నాగేశ్వర రావు పీఏ దుర్గా ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు.
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
Also Read: Crime News: మత్తుమందు ఇచ్చి.. 14 రోజుల పాటు వితంతువుపై సామూహిక అత్యాచారం!
‘ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ పండగలు ఉడడంతో పాకిస్థాన్, న్యూజిలాండ్ ప్రాక్టీస్ మ్యాచ్కు భద్రత కల్పించలేమని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. దాంతో ఈ మ్యాచ్ను ఖాళీ స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ సెక్రటరీ జై షా, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లాకు చెబితే.. వారు అంగీకరించారు. సోమవారం బీసీసీఐకి లెటర్ రాశాం. బీసీసీఐ నుంచి అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నాం’ అని దుర్గాప్రసాద్ తెలిపారు. అక్టోబర్ 3న ఆస్ట్రేలియా-పాకిస్థాన్ వార్మప్ మ్యాచ్, మిగతా ప్రధాన ప్రపంచకప్ మ్యాచ్లు ఫ్యాన్స్ మధ్యన జరుగుతాయని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?