NTV Telugu Site icon

NDA Alliance: ఏపీలో ఎన్డీయే కూటమి తరపున ఇంకా క్లారిటీ రానీ స్థానాలు ఇవే..!

Nda

Nda

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తరపున ఇంకా 20 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాలు క్లారిటీ రాలేదు.. తాము ప్రకటించిన అనపర్తి, పి.గన్నవరం స్థానాలను బీజేపీ, జనసేనలకు టీడీపీ వదిలి పెట్టింది. దీంతో టీడీపీలో పెండింగ్ స్థానాలు ఏడుకు పెరిగాయి. బీజేపీ -10, జనసేన – 3 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో పెండింగ్ ఉన్నాయి.

బీజేపీ పెండింగ్ స్థానాలు ఇవే: ఎచ్చెర్ల, అనపర్తి, విజయవాడ-వెస్ట్, బద్వేల్, ఆదోని, పాడేరు, ధర్మవరం, జమ్మలమడుగు, కైకలూరు, వైజాగ్-నార్త్.
జనసేన పెండింగ్ స్థానాలు: పాలకొండ, రైల్వే కోడూరు, అవనిగడ్డ.
టీడీపీ పెండింగ్ స్థానాలు: దర్శి, చీపురుపల్లి, భీమిలి, అనంత అర్బన్, రాజంపేట, గుంతకల్లు, ఆలూరు ఉన్నాయి.

Read Also: Assam : ఐఎస్ఐఎస్‌లో చేరబోతున్న విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

అలాగే, పెండింగులో ఉన్న ఎంపీ స్థానాలు ఇవే..
బీజేపీ: విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అరకు, తిరుపతి, నరసాపురం.
టీడీపీ: అనంతపురం, రాజంపేట, కడప, ఒంగోలు ఉన్నాయి.. అలాగే, రాజంపేట లోక్ సభ స్థానం కూడా ఇవ్వాలని బీజేపీ కోరుతుంది. విజయనగరం స్థానంలో రాజంపేట లేదా అనంతపురం లోక్ సభ స్థానం ఇవ్వాలని కమలం పార్టీ డిమాండ్ చేస్తుంది.