I.N.D.I.A: ప్రధానిగా ఆయనకు మించిన అభ్యర్థి లేడు: జేడీయూ నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్రమోడీని ఈసారి ఎలాగైనా గద్దెదించాలనే లక్ష్యంతో విపక్షాలు కలిసి ఏర్పాటు చేసిన కూటమి ఇండియా. ఈ కూటమికి సంబంధించి ప్రధాని అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. అయితే అందులో ఉన్న పార్టీల నేతలందరు మాత్రం ఐకమత్యంగా ఉండటం చాలా అవసరమని ఆ మాటపై కట్టుబడి ఉన్నారు. ఇక ప్రధాని అభ్యర్థి పేరు ప్రకటించకపోవడంతో ప్రతి పార్టీకి చెందిన నేతలు తమ నాయకుడే ప్రధాని అభ్యర్థికి సమర్థుడు అంటూ ప్రకటిస్తున్నారు.
Also Read: Suryakumar Yadav Sixes: కెమరూన్ గ్రీన్కు దడ పుట్టించిన సూర్యకుమార్ యాదవ్.. వీడియో చూశారా?
Also Read
- IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
- FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
- ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
తాజాగా ప్రధానిగా తమ పార్టీ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను మించిన సమర్థుడైన నాయకుడు మరొకరు లేరని ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్, జేడీయూ నేత మహేశ్వర్ హజారీ అన్నారు. ప్రధానిగా కావాల్సిన అన్ని లక్షణాలు నితీశ్ కుమార్లో ఉన్నాయని ఆయన కొనియాడారు. ఇండియా కూటమి ఎప్పుడు ప్రధాని పేరును ప్రకటిస్తుందో తనకు తెలియదని కానీ అలా ప్రకటిస్తే అది కచ్ఛితంగా నితీశ్ కుమార్ పేరే అయి ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరును త్వరలోనే ఇండియా కూటమి ప్రకటిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
నితీష్ కుమార్ ఐదుసార్లు కేంద్రమంత్రిగా పని చేశారని, 18 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా ఉంటున్నారన్న విషయాన్ని మహేశ్వర్ హజారీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రధాని అభ్యర్థి కావడంపై నితీశ్ ను పలు సందర్భాల్లో అడగ్గా తాను ఏ పదవి కోరుకోవడం లేదని, ప్రతిపక్ష నాయకులను ఏకం చేసి ముందుకు సాగుతామని నితీష్ కుమార్ గతంలో చెప్పారు. తనకు ప్రధాని పదవిపై ఆశలు లేవని, 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడేందుకు తాను నాయకత్వం వహిస్తానని ఆయన ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇక ప్రధాన నేతలు తమకు పదవులపై ఆశలు లేవని చెబుతున్నా వారి అనుచరులు మాత్రం తమ నేతే ప్రధాని అభ్యర్థి అంటూ పలుమార్లు ప్రకటిస్తున్నారు. ఇక పశ్చిమబెంగాల్ టీఎంసీ నేతలు కూడా తమ నాయకురాలు మమతా బెనర్జీనే ప్రధాని అభ్యర్థికి సరైన వ్యక్తి అంటూ పలుమార్లు అన్నారు.
తాజావార్తలు
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్పై క్రేజీ అప్డేట్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!