Nityananda : నిత్యానంద మృతి? కైలాస నుంచి షాకింగ్ రియాక్షన్..!
- నిత్యానంద మృతి వార్తలు – వాస్తవం ఏమిటి?
- కైలాస నుంచి విడుదలైన అధికారిక ప్రకటన
- నిత్యానంద వివాదాలు – పరారయిన గురువు జీవ సమాధిలోనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nityananda : వివాదస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మృతి చెందారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ కోసం తన ప్రాణాలు త్యాగం చేశాడంటూ, నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ తమిళ మీడియాతో చెప్పిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊపునిచ్చాయి. అయితే, ఈ వార్తలపై కైలాస దేశం నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది.
తన మృతిపై వస్తున్న వదంతులను ఖండించిన నిత్యానంద, తాను పూర్తిగా సురక్షితంగా ఉన్నానని, జీవ సమాధి (సుప్తావస్థ)లో ఉన్నానని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆయన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యానంద ప్రస్తుతం తన స్వంత ద్వీప దేశం కైలాసలో ఉంటూ, తన ధార్మిక కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం.
Also Read
- 8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
- ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
భారతదేశ న్యాయవ్యవస్థలో నిత్యానందపై పలు ఆరోపణలు ఉన్నాయి. అత్యాచారం, అపహరణ వంటి కేసుల కారణంగా ఆయనపై విచారణ కొనసాగుతోంది. 2019లో అకస్మాత్తుగా దేశం విడిచి వెళ్ళిపోయిన నిత్యానంద, ఆ తర్వాత తన స్వంత ద్వీపం కైలాసను స్థాపించినట్లు ప్రకటించారు. అంతేకాదు, దీన్ని స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా పంపినట్లు చెబుతారు.
2022లోనూ నిత్యానంద మృతి చెందారని వస్తున్న వార్తలను ఆయన స్వయంగా ఖండించారు. తాను చనిపోలేదని, జీవ సమాధిలో ఉన్నానని ప్రకటించారు. ఇక, ఆయన చివరిసారిగా 2022 మహాశివరాత్రి రోజున యూట్యూబ్లో ప్రత్యక్షమయ్యారు.
తమిళనాడులోని తిరువణ్ణామలై సమీపంలోని అరుణాచలం ప్రాంతంలో జన్మించిన నిత్యానంద, 2002లో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. 2003లో బెంగుళూరులో ధ్యానపీఠం అనే ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ తర్వాత, దేశవ్యాప్తంగా అనేక ఆశ్రమాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పరిచారు. తాజా పరిణామాల నేపథ్యంలో, నిత్యానంద తన భక్తులకు ఓ ప్రకటన విడుదల చేయడం ద్వారా వారి ఆందోళన తొలగించారని చెప్పవచ్చు. ఆయన ఆరోగ్యంగా, కైలాసలో ఉంటూ తన మిషన్ను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
IPL 2025: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు దక్కని చోటు!
తాజావార్తలు
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!