Nityananda : నిత్యానంద మృతి? కైలాస నుంచి షాకింగ్ రియాక్షన్..!
- నిత్యానంద మృతి వార్తలు – వాస్తవం ఏమిటి?
- కైలాస నుంచి విడుదలైన అధికారిక ప్రకటన
- నిత్యానంద వివాదాలు – పరారయిన గురువు జీవ సమాధిలోనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nityananda : వివాదస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మృతి చెందారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణ కోసం తన ప్రాణాలు త్యాగం చేశాడంటూ, నిత్యానంద మేనల్లుడు సుందరేశ్వరన్ తమిళ మీడియాతో చెప్పిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత ఊపునిచ్చాయి. అయితే, ఈ వార్తలపై కైలాస దేశం నుంచి అధికారిక ప్రకటన విడుదలైంది.
తన మృతిపై వస్తున్న వదంతులను ఖండించిన నిత్యానంద, తాను పూర్తిగా సురక్షితంగా ఉన్నానని, జీవ సమాధి (సుప్తావస్థ)లో ఉన్నానని ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆయన భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. నిత్యానంద ప్రస్తుతం తన స్వంత ద్వీప దేశం కైలాసలో ఉంటూ, తన ధార్మిక కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు సమాచారం.
Also Read
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
భారతదేశ న్యాయవ్యవస్థలో నిత్యానందపై పలు ఆరోపణలు ఉన్నాయి. అత్యాచారం, అపహరణ వంటి కేసుల కారణంగా ఆయనపై విచారణ కొనసాగుతోంది. 2019లో అకస్మాత్తుగా దేశం విడిచి వెళ్ళిపోయిన నిత్యానంద, ఆ తర్వాత తన స్వంత ద్వీపం కైలాసను స్థాపించినట్లు ప్రకటించారు. అంతేకాదు, దీన్ని స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా పంపినట్లు చెబుతారు.
2022లోనూ నిత్యానంద మృతి చెందారని వస్తున్న వార్తలను ఆయన స్వయంగా ఖండించారు. తాను చనిపోలేదని, జీవ సమాధిలో ఉన్నానని ప్రకటించారు. ఇక, ఆయన చివరిసారిగా 2022 మహాశివరాత్రి రోజున యూట్యూబ్లో ప్రత్యక్షమయ్యారు.
తమిళనాడులోని తిరువణ్ణామలై సమీపంలోని అరుణాచలం ప్రాంతంలో జన్మించిన నిత్యానంద, 2002లో తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. 2003లో బెంగుళూరులో ధ్యానపీఠం అనే ఆశ్రమాన్ని స్థాపించారు. ఆ తర్వాత, దేశవ్యాప్తంగా అనేక ఆశ్రమాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పరిచారు. తాజా పరిణామాల నేపథ్యంలో, నిత్యానంద తన భక్తులకు ఓ ప్రకటన విడుదల చేయడం ద్వారా వారి ఆందోళన తొలగించారని చెప్పవచ్చు. ఆయన ఆరోగ్యంగా, కైలాసలో ఉంటూ తన మిషన్ను కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
IPL 2025: ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్.. రోహిత్ శర్మకు దక్కని చోటు!
తాజావార్తలు
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
ట్రెండింగ్
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..