Nipah virus : కేరళలో నిఫా కలకలం.. మూడు జిల్లాల్లో కంటైన్మెంట్ జోన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nipah virus : అనాలోచితంగా మనిషి చేసిన వికృత చేష్టల ఫలితంగా ఆవిర్భవించిన కరోనా ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడిప్పుడే అందరు ఆ పీడకలని మరిచిపోతున్నారు. ఇంతలో మరో కొత్త వైరస్ విజృంభిస్తుంది. కేరళ రాష్ట్రాన్ని వణికిస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల ఇద్దరు మృతి చెందారు. దీనితో కేరళ ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో కంటైన్మెంట్ జోన్ ప్రకటించింది. వివరాలలోకి వెళ్తే కేరళలోని కాలికట్ (కోజికోడ్) జిల్లాలో నిపా వైరస్ ఉన్నట్లు అనుమానం వ్యక్తం అయ్యింది. ఇప్పటికే ఈ జిల్లాలో ఇద్దరు జ్వరంతో మరణించారు. దీనితో ఇది నిపా అని నిర్ధారించడానికి నమూనాలను పూణే ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
Read Also:Subhas Sarkar: కేంద్రమంత్రిని గదిలో తాళం వేసి బంధించిన సొంతపార్టీ నేతలు
Also Read
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కన్నూర్, వయనాడ్, మలప్పురం కోజికోడ్ జిల్లాల్లో కంటైన్మెంట్ జోన్ ప్రకటించింది. ఈ విషయం పైన స్పందించిన కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ, కేరళ ఆరోగ్య శాఖ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)ని సంప్రదించిందని.. అలానే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన నిపా రోగుల చికిత్స కి అవసరమయ్యే మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని అందిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, కంటైన్మెంట్ జోన్ లో ఉన్న జిల్లాలలో నిఘా కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయని ఆరోగ్య మంత్రి తెలియజేశారు.
Read Also:Salaar: సంతోషం… ఇప్పటికైనా వాయిదా అని చెప్పారు… మరి కొత్త రిలీజ్ డేట్?
ప్రస్తుత పరిస్థితి గురించి చర్చించడానికి గత రాత్రి కోజికోడ్ లో సమావేశం నిర్వహించారు మంత్రి.. ఈ సమావేశానికి ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ , ప్రజాపనుల శాఖ మంత్రి మహ్మద్ రియాజ్, జిల్లాలోని ఎమ్మెల్యేలు,బాధిత ప్రాంతాల ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు, ఇతర అధికారులు ఈ అత్యవసర సమావేశానికి హాజరు అయ్యారు. వ్యాధిగ్రస్తుల సంరక్షణ కోసం PPE కిట్లు, N95 మాస్క్లు మరియు వైద్య సిబ్బందికి ఇతర రక్షణ పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆసుపత్రుల్లో తగిన సంఖ్యలో సిబ్బంది, మందులు ఉండేలా చూసుకున్నారు.
తాజావార్తలు
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!