Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ బీపీవో కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కీలక విచారణ ముగిసింది. ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న నాసిక్ రోడ్ సెషన్స్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2వ తేదీన కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ తీర్పుపైనే నిలిచింది. ఈ కేసులో మతమార్పిడి ప్రయత్నం, మత మనోభావాలను దెబ్బతీయడం, లైంగిక వేధింపులు వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు పేర్కొనబడింది. కేసు మొదటి నుంచే వివాదాస్పదంగా మారగా, ఇప్పుడు బెయిల్ విచారణతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
Also Read
- PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- Raghav Chadha vs AAP: ఎంపీని చేయకపోతే పెళ్లి అయ్యేదా? రాఘవ్ చద్దాపై ఆప్ ధ్వజం
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అజయ్ మిసర్ను నియమించింది. ఈ కేసుకు సంబంధించిన మొత్తం తొమ్మిది కేసుల్లో ఆయన ప్రాసిక్యూషన్ తరఫున వాదిస్తున్నారు. గతంలో మాలేగావ్ పేలుళ్లు, పీఎఫ్ఐ, ముంబై పేలుళ్లు వంటి హైప్రొఫైల్ కేసుల్లో ఆయన వాదనలు వినిపించిన అనుభవం కలిగి ఉన్నారు. నిదా ఖాన్కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేసులో ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే ప్రమాదం కూడా ఉందని వాదించారు. అందువల్ల బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని పోలీసులు కోర్టును కోరారు.
ఇక, బాధితుల తరఫు న్యాయవాదులు కూడా బెయిల్కు వ్యతిరేకంగా జోక్య పిటిషన్ దాఖలు చేశారు. బాధితులకు తీవ్ర అన్యాయం జరిగిందని, నిందితురాలికి ఉపశమనం కల్పించడం న్యాయ ప్రక్రియను దెబ్బతీయవచ్చని పేర్కొన్నారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఉపశమనం ఇవ్వవద్దని కోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో మే 2న వెలువడే కోర్టు తీర్పు ఈ కేసులో కీలక మలుపు కానుంది. బెయిల్ మంజూరు చేస్తారా? లేక తిరస్కరిస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు నిర్ణయం నిందితురాలి భవిష్యత్తుతో పాటు కేసు దర్యాప్తు దిశను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!