Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ బీపీవో కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కీలక విచారణ ముగిసింది. ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న నాసిక్ రోడ్ సెషన్స్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2వ తేదీన కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ తీర్పుపైనే నిలిచింది. ఈ కేసులో మతమార్పిడి ప్రయత్నం, మత మనోభావాలను దెబ్బతీయడం, లైంగిక వేధింపులు వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు పేర్కొనబడింది. కేసు మొదటి నుంచే వివాదాస్పదంగా మారగా, ఇప్పుడు బెయిల్ విచారణతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
Also Read
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అజయ్ మిసర్ను నియమించింది. ఈ కేసుకు సంబంధించిన మొత్తం తొమ్మిది కేసుల్లో ఆయన ప్రాసిక్యూషన్ తరఫున వాదిస్తున్నారు. గతంలో మాలేగావ్ పేలుళ్లు, పీఎఫ్ఐ, ముంబై పేలుళ్లు వంటి హైప్రొఫైల్ కేసుల్లో ఆయన వాదనలు వినిపించిన అనుభవం కలిగి ఉన్నారు. నిదా ఖాన్కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేసులో ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే ప్రమాదం కూడా ఉందని వాదించారు. అందువల్ల బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని పోలీసులు కోర్టును కోరారు.
ఇక, బాధితుల తరఫు న్యాయవాదులు కూడా బెయిల్కు వ్యతిరేకంగా జోక్య పిటిషన్ దాఖలు చేశారు. బాధితులకు తీవ్ర అన్యాయం జరిగిందని, నిందితురాలికి ఉపశమనం కల్పించడం న్యాయ ప్రక్రియను దెబ్బతీయవచ్చని పేర్కొన్నారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఉపశమనం ఇవ్వవద్దని కోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో మే 2న వెలువడే కోర్టు తీర్పు ఈ కేసులో కీలక మలుపు కానుంది. బెయిల్ మంజూరు చేస్తారా? లేక తిరస్కరిస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు నిర్ణయం నిందితురాలి భవిష్యత్తుతో పాటు కేసు దర్యాప్తు దిశను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
-
Elon Musk: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
-
Mega 158 : చిరు సరసన నటించేందుకు బాలయ్య హీరోయిన్ నో..
-
Vaibhav Sooryavanshi-BCCI: అసలు వైభవ్ సూర్యవంశీ మా ప్రణాళికల్లోనే లేడు.. పెద్ద బాంబ్ పేల్చిన బీసీసీఐ!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!