Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ బీపీవో కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై కీలక విచారణ ముగిసింది. ఈ పిటిషన్పై ఇరుపక్షాల వాదనలు విన్న నాసిక్ రోడ్ సెషన్స్ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. మే 2వ తేదీన కోర్టు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆ తీర్పుపైనే నిలిచింది. ఈ కేసులో మతమార్పిడి ప్రయత్నం, మత మనోభావాలను దెబ్బతీయడం, లైంగిక వేధింపులు వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నట్లు పేర్కొనబడింది. కేసు మొదటి నుంచే వివాదాస్పదంగా మారగా, ఇప్పుడు బెయిల్ విచారణతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
Also Read
- Vande Mataram Bill: వందేమాతరానికి అవమానం జరిగితే 3 ఏళ్ల జైలు శిక్ష.. కేంద్రం సరికొత్త బిల్లు!
- Marriage Bureau: 9 ఏళ్లుగా వధువు దొరకలేదు.. మ్యారేజ్ బ్యూరోకు కోర్టు ఫైన్..
- EPFO: ‘విశ్వాస్’ పథకాన్ని ప్రారంభించిన ఈపీఎఫ్వో.. ఎవరి కోసమంటే..!
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అజయ్ మిసర్ను నియమించింది. ఈ కేసుకు సంబంధించిన మొత్తం తొమ్మిది కేసుల్లో ఆయన ప్రాసిక్యూషన్ తరఫున వాదిస్తున్నారు. గతంలో మాలేగావ్ పేలుళ్లు, పీఎఫ్ఐ, ముంబై పేలుళ్లు వంటి హైప్రొఫైల్ కేసుల్లో ఆయన వాదనలు వినిపించిన అనుభవం కలిగి ఉన్నారు. నిదా ఖాన్కు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. కేసులో ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే ప్రమాదం కూడా ఉందని వాదించారు. అందువల్ల బెయిల్ పిటిషన్ను కొట్టివేయాలని పోలీసులు కోర్టును కోరారు.
ఇక, బాధితుల తరఫు న్యాయవాదులు కూడా బెయిల్కు వ్యతిరేకంగా జోక్య పిటిషన్ దాఖలు చేశారు. బాధితులకు తీవ్ర అన్యాయం జరిగిందని, నిందితురాలికి ఉపశమనం కల్పించడం న్యాయ ప్రక్రియను దెబ్బతీయవచ్చని పేర్కొన్నారు. కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ఉపశమనం ఇవ్వవద్దని కోర్టును అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో మే 2న వెలువడే కోర్టు తీర్పు ఈ కేసులో కీలక మలుపు కానుంది. బెయిల్ మంజూరు చేస్తారా? లేక తిరస్కరిస్తారా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు నిర్ణయం నిందితురాలి భవిష్యత్తుతో పాటు కేసు దర్యాప్తు దిశను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?