Fake Paneer Racket: అన్నదమ్ముల ‘కల్తీ’ పాపం.. పనీర్ లవర్స్కు అలర్ట్.. “మీరు తినేది పనీరా లేక పాయిజనా?”
- 28 క్వింటాళ్ల నకిలీ పనీర్ సీజ్
- నకిలీ పనీర్ రాకెట్ గుట్టురట్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fake Paneer Racket: ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న కల్తీ మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ఓ ఇద్దరు అన్నదమ్ముల ‘కల్తీ’ పాపం ప్రజల ఆరోగ్యంపై విశేష ప్రభావం చూపే ప్రమాదం నుంచి అధికారులు జనాలను కాపాడారు. మీరట్ పరిధిలోని జానీ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగ్లా కుంభా గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న రెండు నకిలీ పనీర్ ఫ్యాక్టరీలపై లక్నో ఆహార విభాగం అధికారులు, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. అసలు ఏం జరిగిందంటే..
Also Read
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
- IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
నగ్లా కుంభా గ్రామానికి చెందిన హమీద్, జాబిర్ అనే అన్నదమ్ములు ఎటువంటి అనుమతులు లేకుండా సొంతంగా ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి నకిలీ పనీర్ తయారు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఎన్సీఆర్ (NCR) ప్రాంతాలకు ఈ కల్తీ పనీర్ను సరఫరా చేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. కమిషనర్ డాక్టర్ రోషన్ జాకబ్ ఆదేశాల మేరకు జరిగిన ఈ దాడుల్లో హమీద్ ఫ్యాక్టరీ నుంచి 16 క్వింటాళ్లు, జాబిర్ ఫ్యాక్టరీ నుంచి 12 క్వింటాళ్ల నకిలీ పనీర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీలలో నిర్వహించిన సోదాల్లో అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. పనీర్ తయారీ కోసం ఈ అన్నదమ్ములు కేవలం పాలు మాత్రమే కాకుండా.. భారీ మొత్తంలో పామొలిన్ ఆయిల్, మైదా పిండి, నీలి రంగులో ఉన్న అనుమానాస్పద కెమికల్స్ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. సోదాల్లో లభ్యమైన 5300 లీటర్ల పాలు, 510 లీటర్ల రిఫైన్డ్ పామొలిన్ ఆయిల్, 35 కిలోల మైదా, కెమికల్స్ను అధికారులు అక్కడికక్కడే ధ్వంసం చేశారు. నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించినట్లు అధికారులు తెలిపారు.
పోలీసుల రాకను గమనించిన నిందితులు హమీద్, జాబిర్ అక్కడి నుంచి తప్పించుకున్నారు. వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలను సీల్ వేసినట్లు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
తాజావార్తలు
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
-
Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
-
IPL 2026 Playoff Tickets: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ టిక్కెట్స్ షెడ్యూల్ వచ్చేసింది.. ఇక్కడ బుక్ చేసుకోండిలా..
-
Tamil Nadu: షాకింగ్.. 13 ఏళ్ల బాలుడిని చంపి పాతిపెట్టిన మైనర్ స్నేహితులు
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!