New Zealand: న్యూజిలాండ్కు భారీ షాక్.. ప్రపంచకప్ నుంచి స్టార్ ప్లేయర్ అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Zealand Pacer Matt Henry ruled out of ICC ODI World Cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో హ్యాట్రిక్ ఓటములతో డేంజర్ జోన్లోకి వెళ్లిన న్యూజీలాండ్కు భారీ షాక్ తగిలింది. కివీస్ స్టార్ బౌలర్ మ్యాట్ హెన్రీ జట్టుకు దూరం అయ్యాడు. హార్మ్ స్ట్రింగ్ ఇంజ్యురీ కారణంగా ప్రపంచకప్ 2023 నుంచి వైదొలిగాడు. మ్యాట్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం, ఇప్పట్లో అతడు కోలుకునే అవకాశం లేకపోవడంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో కైల్ జెమిసన్ జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని కివీస్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు.
శనివారం బెంగళూరులో పాకిస్థాన్తో జరిగే మ్యాచ్లో కైల్ జెమిసన్ నేరుగా బరిలోకి దిగనున్నాడు. మెగా టోర్నమెంట్లో ట్రావెలింగ్ రిజర్వ్గా జేమీసన్ ఉన్న విషయం తెలిసిందే. జేమీసన్ ప్రపంచకప్లో ఆడడం ఇదే మొదటిసారి. మెగా టోర్నీలో న్యూజీలాండ్ను గాయాలు వేధిస్తున్నాయి. కేన్ విలియమ్సన్, మార్క్ చాప్మన్, లాకీ ఫెర్గూసన్ మరియు జేమ్స్ నీషమ్ గాయపడ్డారు. దాంతో దక్షిణాఫ్రికాతో జరిగిన ఆటలో కేవలం 11 మంది ఫిట్ ప్లేయర్లను మాత్రమే కలిగి ఉంది. దక్షిణాఫ్రికా మ్యాచులోనే మ్యాట్ హెన్రీకి గాయం అయింది. హెన్రీ ఏడు మ్యాచ్ల్లో 5.79 ఎకానమీ, సగటు 28.63తో 11 వికెట్లు తీశాడు.
Also Read
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
- Rohit Sharma: అఫ్గానిస్థాన్ సిరీస్తో రీఎంట్రీ.. అరుదైన రికార్డులపై ‘హిట్మ్యాన్’ గురి.!
Also Read: Virat Kohli Fan: విరాట్ కోహ్లీపై అభిమానం.. 88 శాతం తగ్గింపుతో రూ. 7కే బిర్యాని! ఎక్కడో తెలుసా?
టోర్నీ ఆరంభంలో ఇంగ్లండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్లను ఓడించిన న్యూజీలాండ్.. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలపై ఓడిపోయింది. బుధవారం జరిగిన మ్యాచ్లో ప్రొటీస్ చేతిలో 190 పరుగుల తేడాతో ఓడిపోవడంతో కివీస్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. సెమీస్ చేరాలంటే చివరి రెండు మ్యాచ్ల్లో న్యూజీలాండ్ తప్పక గెలవాల్సి ఉంది. తదుపరి మ్యాచ్ల్లో పాకిస్థాన్ (నవంబర్ 4న), శ్రీలంక (నవంబర్ 9)తో కివీస్ తలపడాల్సి ఉంది. పాకిస్థాన్, శ్రీలంక జట్లపై గెలిస్తే 12 పాయింట్లతో కివీస్ సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ ఒక్క మ్యాచ్లో ఓడినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆ టీమ్ ఆధారపడాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
-
Women’s T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!