Lucknow T20: లక్నో వేదికగా జరుగుతోన్న రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో ఓటమిపాలైన టీమిండియా రెండో మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగింది. టీ20 కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పగ్గాలు చేపట్టాక ఒక్క సిరీస్ కూడా భారత్ ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో రెండో టీ20లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఆడుతోంది. మరో వైపు తొలి టీ20 ఆడిన జట్టుతోనే ఈ మ్యాచ్లోనూ బరిలోకి దిగుతున్నామని కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తెలిపాడు. ఈ పిచ్ మీద గత రికార్డులను బట్టి చూస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువ మ్యాచ్ల్లో గెలిచిందని శాంట్నర్ చెప్పాడు. మరోవైపు వన్డే సిరీస్ చేజార్చుకున్న న్యూజిలాండ్ టీ20 సిరీస్ అయినా గెలవాలని పట్టుదలతో ఉంది. రెండో మ్యాచులోనూ భారత్ ను ఓడించి ట్రోఫీ కొట్టేయాలన్న కసితో న్యూజిలాండ్ ఆడుతోంది. ఈ మ్యాచ్లో భారత్ తుది జట్టులో ఒక మార్పు చేసింది. ఉమ్రాన్ మాలిక్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్ను కెప్టెన్ హార్దిక్ పాండ్య ఆడిస్తున్నట్లు తెలిపాడు. జట్టులో ఇద్దరు స్పిన్నర్లు, మరో ఇద్దరు స్పిన్ ఆల్ రౌండర్లు ఉన్నారు.
భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్.
న్యూజిలాండ్ జట్టు: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, డారెల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మైకెల్ బ్రాస్వెల్, జాకబ్ డఫే, ఇష్ సోధీ, లాకీ ఫెర్గ్యుసన్, బ్లెయిర్ టిక్నర్.