NTV Telugu Site icon

PCB Files Burning Case: పీసీబీ ఫైల్స్ దహనం కేసులో ట్విస్ట్..

Pcb Files

Pcb Files

PCB Files Burning Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పీసీబీ ఫైల్స్ దహనం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. బెజవాడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కార్యాలయంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. పీసీబీలో ఏడు సెక్షన్లకు సంబంధించిన అధికారులను విచారిస్తున్నారు.. పీసీబీ సెక్షన్ కార్యాలయంలో ఉండాల్సిన ఫైల్స్ బయటకు రావడంపై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తున్నారు.. కార్యాలయంలో ఉండాల్సిన ఫైల్స్, హార్డ్ డిస్క్ లు బయటకు వెళ్లటంలో అధికారుల పాత్రపై విచారణ కొనసాగుతోంది.. ఫైల్స్ లో ఉన్న అంశాలు, వాటి ప్రాధాన్యత గురించి స్టేట్ మెంట్స్ రికార్డు చేస్తున్నారు పోలీసులు.. శాఖ ఫైల్స్ బయటకు ఎలా వెళ్లాయి అనే అంశంపై అధికారులను పూర్తిస్థాయిలో ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Read Also: Ghazipur Triple Murder: ప్రేయసి కోసం 15 ఏళ్ల బాలుడి దారుణం.. తల్లిదండ్రులతో పాటు సోదరుడి హత్య..

ఇక, ఈ కేసు విచారణలో పోలీసులకి OSD రామారావు చుక్కలు చూపించినట్టుగా ప్రచారం సాగుతోంది.. ఆ డాక్యుమెంట్స్ పనికిరావని పోలీసులకి విచారణలో చెప్పారట రామారావు.. కానీ, ఆ ఫైల్స్ పడేయాలని చెప్పిన వారి గురించి మాత్రం రామారావు నోరు విప్పలేదట.. ప్రభుత్వ డాక్యుమెంట్స్ డిస్పోజ్ చేసేందుకు ఉన్న ప్రొసీజర్ ఎందుకు ఫాలో అవ్వలేదో కూడా రామారావు చెప్పలేదని తెలుస్తోంది.. పోలీసులు స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ లో కొన్ని పీసీబీ వెబ్ సైట్ లో ఓపెన్ డాక్యుమెంట్స్ గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.. ఇక, దహనం చేసేందుకు ప్రయత్నించిన ఫైల్స్ లో కీలకమైనవి ఏమన్నా ఉన్నాయా అనే గుర్తించే పనిలో పడిపోయారు పోలీసులు.. కాగా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రికార్డుల దగ్ధం కేసు కలకలం రేపింది.. ఈ కేసులో ఓఎస్డీ ఎస్వీ రామారావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. సగం కాలిన రికార్డులు, హార్డ్ కాపీలను కూడా గన్నవరం తీసుకెళ్లారు పోలీసులు. ఎక్సైజ్ శాఖలో సుదీర్ఘ కాలం పనిచేసిన రామారావుపై.. గతంలోనూ అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మరోసారి ఫైల్స్ దగ్ధం ఘటనలో రామారావు పేరు రావడంపై ఎక్సైజ్ శాఖలో చర్చగా మారిన విషయం విదితమే.