Kolkata Doctor Murder : కోల్కతా అత్యాచారం కేసులో కొత్త ట్విస్ట్.. మరణ ధృవీకరణ పత్రంలో సమయం మార్పు!
- కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం..హత్య కొలిక్కి వచ్చేలా లేదు
- తాజాగా డెత్ సర్టిఫికెట్ కి సంబంధించిన అంశంపై చర్చ
- మరణ ధృవీకరణ పత్రంలో సమయం మార్పు!కేసులో కొత్త ట్విస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా లేదు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. అయితే ఇప్పటి వరకు పౌర వాలంటీర్ సంజయ్ రాయ్ మినహా ఎవరినీ అరెస్టు చేయలేదు. ఇదిలా ఉండగా.. వైద్యురాలి మృతికి సంబంధించి విచారణలో నిరంతరం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ట్రైనీ డాక్టర్ మరణానంతరం తాజాగా డెత్ సర్టిఫికెట్ కి సంబంధించిన అంశం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 9వ తేదీ ఉదయం ఆర్జీ కర్ సెమినార్ రూమ్ నుంచి డాక్టర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రానికి ఈ వార్త కుటుంబ సభ్యులకు చేరింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆర్జీ కార్ వద్ద జూనియర్ డాక్టర్లు నిరసన ప్రారంభించారు. ఫోరెన్సిక్ పరీక్ష అనంతరం అదే రోజు బాధితురాలికి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం రాత్రి తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. ఆ రాత్రికి దహన సంస్కారాలు జరిగాయి.
READ MORE: Perni Nani: ఎన్నికల్లో ఓటమి వల్ల పార్టీ పని అయిపోదు.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య బాధితురాలు మృతి చెందింది. ఇప్పుడు .. ఓ జాతీయ మీడియా సంస్థ ప్రకారం.. బాధితురాలిని దహనం చేసిన పానిహతి శ్మశాన వాటిక రిజిస్టర్లో మరణించిన సమయం 12:44 PM అని వ్రాయబడింది. ఈ రిజిస్టర్ను చూసిన తర్వాత.. దహన ధృవీకరణ పత్రం లేదా ఘాట్ సర్టిఫికేట్ తయారు చేయబడుతుంది. ఆ తర్వాత రెండు డాక్యుమెంట్లలో పేర్కొన్న సమయానికి ఇంత తేడా ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యత్యాసంపై బాధితురాలి తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. వైద్యురాలి తండ్రి మాట్లాడుతూ.. “నా కూతురిపై అత్యాచారం, హత్య వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ఈ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు చేస్తున్న కుట్ర పన్నుతున్నారు.” అని ఆందోళన వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!