NTV Telugu Site icon

Tummala Nageswara Rao : ఏడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గం

Tummala Nageswara Rao

Tummala Nageswara Rao

ఏడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, జగిత్యాల జిల్లాలోని వెలగటూరు, కామారెడ్డి జిల్లాలోనే గాంధరి, సదాశివనగర్, ఎల్లారెడ్డి, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి, మద్దులపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలకు చైర్ పర్సన్ లను, వైస్ చైర్ పర్సన్లతో పాటు నూతన పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కరి అనితారెడ్డి, వైస్ చైర్ పర్సన్ గా గడుగు విజయ్ కుమార్, వెలగటూరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా గుండటి గోపిక, వైస్ చైర్ పర్సన్ గా గొల్ల తిరుపతి, గాంధరి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా బండారి పరమేశ్వర్, వైస్ చైర్ పర్సన్ గా ఆకుల లక్ష్మణ్, సదాశివనగర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా మాలోతు సంగ్య, వైస్ చైర్ పర్సన్ గా జక్కుల రాజారెడ్డి, ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మారెడ్డి రజిత, వైస్ చైర్ పర్సన్ గా జొన్నల రాజు, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా వెన్నపూసల సీతరాములు, వైస్ చైర్ పర్సన్ గా కొండపర్తి సురేష్, మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా బైరు హరినాథ బాబు, వైస్ చైర్ పర్సన్ గా వనవాసం నరేందర్ రెడ్డి నియామకమయ్యారు.

Hair fall: వానాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చేయండి