New FASTag Rules: ఈ రోజే మారిన ఫాస్టాగ్ రూల్స్.. ఫాస్టాగ్ లేకపోయినా లేదా దానిని రీఛార్జ్ చేయకపోయినా ఏమవుంతో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New FASTag Rules: దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ వసూలు విధానంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం, టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేసి, డిజిటల్ చెల్లింపులను తప్పనిసరి చేశారు. దీంతో FASTag లేని వారు లేదా రీఛార్జ్ చేయని వారు అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇవాళ్టి నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు: కొత్త రూల్స్ ప్రకారం, టోల్ ప్లాజాల వద్ద FASTag ప్రధాన చెల్లింపు పద్ధతిగా మారింది. వాహనదారుల వద్ద చెల్లుబాటు అయ్యే FASTag లేకపోతే, వారు UPI ద్వారా చెల్లించవచ్చు. అయితే అలాంటి సందర్భాల్లో అసలు టోల్ మొత్తానికి 1.25 రెట్లు వరకు చార్జ్ వసూలు చేయబడుతుంది.
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
FASTag లేకపోతే ఏమవుతుంది?: మీ వాహనానికి FASTag లేకపోతే.. నగదు చెల్లింపులు అంగీకరించరు.. అయితే, UPI ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.. టోల్ మొత్తంపై అదనంగా 25 శాతం సెస్ విధించబడుతుంది.. దీంతో ఎక్కువసేపు ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది..
బ్లాక్లిస్ట్ ట్యాగ్ అయితే రెట్టింపు టోల్: FASTag ఉన్నా, అది బ్లాక్లిస్ట్ అయి ఉంటే లేదా కనీస బ్యాలెన్స్ లేకపోతే FASTag లేన్లో ప్రవేశించినప్పుడు రెట్టింపు టోల్ వసూలు చేసే అవకాశం ఉంది. అందుకే సమయానికి రీఛార్జ్ చేసుకోవడం అవసరం.
చెల్లించకపోతే ఈ-నోటీసు: టోల్ ప్లాజా వద్ద డిజిటల్ చెల్లింపు విఫలమైతే, సంబంధిత వాహన యజమానికి ఈ-నోటీసు జారీ చేస్తారు. మూడు రోజులలోపు చెల్లింపు చేయకపోతే, బకాయి మొత్తం రెట్టింపు కావచ్చు.
15 రోజుల తర్వాత మరిన్ని ఇబ్బందులు: చెల్లింపులు 15 రోజులకుపైగా పెండింగ్లో ఉంటే, వాహన డేటాబేస్లో నమోదు చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్, యాజమాన్య బదిలీ వంటి సేవలపై పరిమితులు విధించే అవకాశం ఉంది.
టోల్ ఛార్జీలు కూడా పెరిగాయి: 2026-27 ఆర్థిక సంవత్సరానికి టోల్ రేట్లు సవరించబడ్డాయి. అలాగే వార్షిక FASTag పాస్ ధర ₹3,000 నుంచి ₹3,075కు పెరిగింది. ఈ పాస్ కార్లు, జీపులు, వ్యాన్ల వంటి వాణిజ్యేతర వాహనాలకు వర్తిస్తుంది.
వెంటనే FASTag రీఛార్జ్ చేసుకోండి: టోల్ ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే, మీ FASTag యాక్టివ్గా ఉందో లేదో చెక్ చేసుకుని వెంటనే రీఛార్జ్ చేసుకోవడం మంచిది. లేదంటే అదనపు టోల్ చెల్లించాల్సి వస్తుంది. మొత్తంగా డిజిటల్ ఇండియాలో భాగంగా టోల్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి వాహనదారులు FASTag వినియోగంపై అవగాహన పెంచుకుని, ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలి.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!