New Digital Payment Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్.. డిజిటల్ చెల్లింపుల కోసం ఇది తప్పనిసరి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Digital Payment Rules: ఏప్రిల్ 1, 2026 నుంచి దేశంలో డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన కీలక నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులతో ఆన్లైన్ లావాదేవీలు మరింత సురక్షితంగా మారనున్నాయి. ముఖ్యంగా సైబర్ మోసాలను అరికట్టే లక్ష్యంతో ఈ కొత్త విధానాలను అమలు చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల ప్రకారం, ఇకపై ప్రతి డిజిటల్ లావాదేవీకి రెండు-దశల ప్రమాణీకరణ తప్పనిసరి కానుంది. ఇప్పటివరకు కేవలం OTP ఆధారంగా జరిగే లావాదేవీలు ఇకపై సరిపోవు. వినియోగదారులు కనీసం రెండు వేర్వేరు ధృవీకరణ విధానాలను ఉపయోగించాల్సి ఉంటుంది.
ఈ నిబంధన సెప్టెంబర్ 2025లో ప్రకటించబడగా, బ్యాంకులకు అమలు కోసం ఏప్రిల్ 1, 2026 వరకు గడువు ఇచ్చారు. ప్రస్తుతం క్రెడిట్ కార్డులపై ఇప్పటికే 2FA అమల్లో ఉండగా, ఇకపై అన్ని రకాల డిజిటల్ లావాదేవీలకు ఇది వర్తించనుంది.
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
2FAలో ఉపయోగించే ధృవీకరణ పద్ధతులు
డిజిటల్ చెల్లింపుల సమయంలో ఇలా..
* వ్యక్తిగత గుర్తింపు సంఖ్య (PIN)
* వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు వంటి బయోమెట్రిక్ విధానాలు
* బ్యాంకింగ్ యాప్లలో రూపొందించే వర్చువల్ టోకెన్లు
* SMS ద్వారా వచ్చే OTP
ఈ విధానాలలో కనీసం రెండు ఉపయోగించి లావాదేవీని పూర్తి చేయాలి: ఉదాహరణకు.. OTP + PIN… బయోమెట్రిక్ ధృవీకరణ + పరికరం గుర్తింపు.. టోకెన్ + పాస్వర్డ్..
లావాదేవీలలో మార్పులు ఎలా ఉంటాయి?
ఉదాహరణకు, మీరు ఒక దుకాణంలో డెబిట్ కార్డు ద్వారా చెల్లింపు చేస్తే, ముందుగా PIN నమోదు చేయడం మాత్రమే కాకుండా, అదనంగా OTP లేదా మరొక ధృవీకరణ అవసరం అవుతుంది. అలాగే ఆన్లైన్ చెల్లింపుల సమయంలో కూడా రెండు-స్థాయి ధృవీకరణ తప్పనిసరి అవుతుంది.
సైబర్ మోసాలకు అడ్డుకట్ట
ఇటీవలి కాలంలో ఫిషింగ్, సిమ్ స్వాపింగ్, OTP మోసాలు విపరీతంగా పెరిగాయి. మోసగాళ్లు వినియోగదారుల OTPలను సేకరించి బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్న ఘటనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో 2FA అమలు చేయడం ద్వారా అనధికార లావాదేవీలను గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక, ఈ నిబంధనలు కేవలం దేశీయ లావాదేవీలకే కాకుండా, అంతర్జాతీయ ఆన్లైన్ చెల్లింపులకు కూడా వర్తించనున్నాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం, అక్టోబర్ 1, 2026 నాటికి అంతర్జాతీయ కార్డ్-నాట్-ప్రెజెంట్ లావాదేవీలకు కూడా ఇదే విధమైన భద్రతా ప్రమాణాలు తప్పనిసరి అవుతాయి.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!