Nepal PM India Tour: త్వరలో భారత్లో పర్యటించనున్న నేపాల్ ప్రధాని!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nepal PM India Tour: నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ప్రచండ మూడోసారి దేశ అత్యున్నత కార్యనిర్వాహక పదవిని చేపట్టిన తర్వాత తన మొదటి విదేశీ పర్యటనలో త్వరలో భారతదేశాన్ని సందర్శిస్తానని చెప్పారు. ప్రచండ గత ఏడాది డిసెంబర్ 26న మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. త్వరలో భారతదేశాన్ని సందర్శిస్తానని ప్రచండ ప్రధానిగా ఎన్నికైన తర్వాత విలేఖరులతో అన్నారు. ఇందుకు సంబంధించి దౌత్య స్థాయిలో సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. సంబంధిత రాయబార కార్యాలయాలు తన పర్యటన కోసం సన్నాహాలు చేస్తున్నాయని ఆయన ప్రధానమంత్రి అధికారిక నివాసమైన బలువతార్లో విలేకరులతో అన్నారు.
అయితే ప్రధాని భారత పర్యటనను నేపాల్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. పర్యటన తేదీ, ప్రయాణం ఇంకా ఖరారు కాలేదు. ప్రధాని పర్యటన తేదీ, వివరణాత్మక కార్యక్రమాలతో పాటు పర్యటన ఎజెండాను ఖరారు చేయడానికి కృషి చేస్తున్నామని విదేశాంగ మంత్రిత్వ శాఖలోని ఒక అధికారి తెలిపారు. ప్రధానమంత్రి పదవిని స్వీకరించిన తర్వాత పొరుగు దేశాన్ని సందర్శించడం సాధారణ ప్రక్రియ అని ఆయన వెల్లడించారు. ప్రచండ అంతకుముందు నేపాల్ ప్రధానిగా ఉన్న సమయంలో కూడా భారతదేశానికి అధికారిక పర్యటనలు చేశారు. గతేడాది జూలైలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆహ్వానం మేరకు ప్రచండ భారత్లో పర్యటించారు.
Also Read
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
- Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
- Gunasekhar: అలా పుట్టిందే 'ఒక్కడు' సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
Naatu Naatu Song: నాటు నాటును బాగానే వాడేస్తున్నారుగా… ట్రెండ్ ఫాలో అవుతున్న పోలీసులు
నేపాలీ ప్రధానులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తమ మొదటి విదేశీ పర్యటనకు సాంప్రదాయకంగా న్యూఢిల్లీని ఎంచుకుంటారు. కానీ ప్రచండ 2008లో తొలిసారిగా ప్రధానమంత్రిగా ఎన్నికైన తర్వాత భారత్కు వెళ్లకుండానే ఒలింపిక్స్ ప్రారంభోత్సవం కోసం బీజింగ్ను సందర్శించేందుకు వెళ్లిపోయారు. అయితే ఆయన రెండోసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, సెప్టెంబరు, 2016లో విదేశీ పర్యటనలో మొదటిసారి భారతదేశానికి వచ్చారు. కొత్త రాష్ట్రపతి ఎన్నిక తర్వాతే ప్రచండ పర్యటన ఉంటుందని పలువురు నేతలు వెల్లడించినట్లు సమాచారం. రాష్ట్రపతిని ఎన్నుకోకముందే భారత పర్యటనకు పట్టుబట్టినట్లయితే పర్యటన ముందుగానే జరగొచ్చని వారిలో ఒకరు చెప్పారు. ప్రెసిడెంట్ బిద్యా దేవి భండారీ పదవీకాలం మార్చి నెలాఖరుతో ముగియనుండడంతో ఫిబ్రవరిలో రాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. రాజ్యాంగం ప్రకారం, అధికారంలో ఉన్న వ్యక్తి పదవీకాలం ముగియడానికి ఒక నెల ముందు ఎన్నికలు నిర్వహిస్తారు.
తాజావార్తలు
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
-
Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి… తెలుగులోనూ స్ట్రీమింగ్
-
Delhi: ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో కీలక విషయాలు బట్టబయలు.. వంటవాడి నిర్లక్ష్యానికి 21 మంది బలి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!