Nepal Petrol Crisis: ఇంధన కొరత వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారానికి రెండు రోజులు సెలవులు..!
- ఇంధన కొరత వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రభుత్వ కార్యాలయాలకు శని, ఆదివారాలను రెండు వారపు సెలవు
- నేపాల్ ప్రభుత్వం ఆదివారం రెండు ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ కారణంగా వరల్డ్ వైడ్ గా ఇంధన సంక్షోభం తలెత్తింది. గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హార్మూజ్ జలసంధిని ఇరాన్ క్లోజ్ చేయడంతో మరిస్థితి దారుణంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు రోజులు సెలవులు ప్రకటించింది. అయితే ఇది మన దేశంలో కాదండోయ్. పొరుగు దేశమైన నేపాల్ లో. ప్రభుత్వ కార్యాలయాలకు శని, ఆదివారాలను రెండు వారపు సెలవు దినాలుగా ప్రకటిస్తూ నేపాల్ ప్రభుత్వం ఆదివారం రెండు ముఖ్యమైన నిర్ణయాలను ప్రకటించింది. ఈ కొత్త నిర్ణయం ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయి.
Also Read:Green Asha: గుడ్ న్యూస్.. హర్మూజ్ దాటిన మరో భారత ఎల్పీజీ నౌక..
Also Read
- Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
- CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
- Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు ఇకపై శని, ఆదివారాల్లో మూసివేయబడతాయని ప్రభుత్వ ప్రతినిధి సస్మిత్ పోఖరేల్ తెలిపారు. పెట్రోలియం సరఫరాల విషయంలో నెలకొన్న క్లిష్ట పరిస్థితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటివరకు నేపాల్లో శనివారం మాత్రమే వారపు సెలవు దినంగా ఉండేది, కానీ ఈ వారం నుండి శని, ఆదివారాలు రెండూ సెలవు దినాలుగా ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాల పనివేళలను ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read:US pilot rescue Op: సినిమాకు ఏం తక్కువ కాదు.. ఇరాన్లో యూఎస్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ హైలెట్స్..
విద్యా సంస్థలు మినహా ప్రభుత్వ కార్యాలయాలకు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనివేళలను కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సమయ పరిమితి విద్యా సంస్థలు మినహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు వర్తిస్తుంది. ఇప్పటి వరకు నేపాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేసేవి, అయితే ఉదయం పూట ఈ సమయాన్ని ఒక గంట పొడిగించారు. ఈ కొత్త విధానం సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. పనితీరుకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, ప్రభుత్వ కార్యాలయ ఉద్యోగులు ఇకపై ఒక గంట ముందుగా, అంటే ఉదయం 9 గంటలకే విధులకు హాజరు కావాల్సి ఉంటుంది.
తాజావార్తలు
-
Abhishek Banerjee: రాళ్లు విసురుతున్నారు.. కోడిగుడ్లతో కొడుతున్నారు..మమత మేనల్లుడుపై ఎందుకింత కసి?
-
Ashok Dinda: క్రికెట్ నుంచి రాజకీయాలకు.. బెంగాల్ మంత్రిగా మాజీ భారత పేసర్.!
-
Tragedy: చూడ ముచ్చటైన జంట.. పెళ్లైన కొద్ది గంటల్లోనే విషాదం.. హెలికాప్టర్ ప్రమాదంలో భారత సంతతి పైలట్ మృతి
-
CM Revanth: రూ.1000 కోట్ల నిధులపై సీఎం ఫోకస్.. అధికారులకు సీరియస్ వార్నింగ్.!
-
Virat Kohli Watch Price: ఆ ఒక్క వాచ్ తో ఓ కుటుంబం లైఫ్ టైం సెటిల్ కదయ్యా.. RCB సంబరాల్లో కోహ్లీ వాచ్ హాట్ టాపిక్.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!