Nagaland, Meghalaya: ఐదోసారి నాగాలాండ్ సీఎంగా నెయిఫియు రియో, మేఘాలయకు మళ్లీ కాన్రాడ్ సంగ్మా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagaland, Meghalaya: నాగాలాండ్ రాజకీయ ప్రముఖుడు, సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన నెయిఫియు రియో ఐదోసారి సీఎం పదవిని చేపట్టనున్నారు. తాజా ఎన్నికల్లో అధికారానికి అవసరమైన పూర్తి మెజార్టీ సాధించిన ఎన్డీపీపీ కూటమి.. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఐదోసారి సీఎంగా నెయిఫియు రియో ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రాన్ని సుదీర్ఘ కాలం పాలించిన ముఖ్యమంత్రిగానూ ఆయన రికార్డు సృష్టించారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భాజపాతో కలిసి అధికార ఎన్డీపీపీ (నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ) పోటీ చేసింది. తాజా ఫలితాల్లో ఎన్డీపీపీ 25 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 12 చోట్ల గెలిచింది. మొత్తంగా ఈ కూటమి 37 స్థానాలను కైవసం చేసుకొని మెజార్టీ మార్కు 31ని దాటింది. దీంతో నెయిఫియు రియో మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. నెయిఫియు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన రియో.. 1987లో ఒక్కసారి మాత్రమే ఓటమిని చవిచూశారు. ఆ సమయంలో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పటినుంచి ఆయన రాజకీయాల్లో వెనక్కి తిరిగి చూడలేదు. 2002 వరకు జమీర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో హోం మంత్రిగా, అంతకు ముందు వివిధ హోదాల్లో రియో పనిచేశారు. అనంతరం కాంగ్రెసును వీడి నాగా పీపుల్స్ ఫ్రంట్ను పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. 2003లో అప్పటి ముఖ్యమంత్రి జమీర్ను గద్దెదించి తొలిసారి నాగాలాండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2008లో రాష్ట్రపతి పాలన విధించడంతో సీఎం పదవిని కోల్పోవాల్సి వచ్చింది.
Also Read
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
- PM Modi: "నీట్ పేపర్ లీక్ 'ఘోర పాపం'.. కఠిన శిక్ష తప్పదు".. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
- Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
- Tattoo Trends 2026: టాటూ ప్లేస్మెంట్ ఎందుకు ముఖ్యం..? 2026లో మారుతున్న కొత్త ట్రెండ్ ఇదే
Read Also: Pakistan: పీఓకేలో మహిళా టీచర్లు, బాలికలకు హిజాబ్ తప్పనిసరి..
ఇదిలా ఉండగా.. మేఘాలయా కొత్త ముఖ్యమంత్రిగా ఎన్పీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా ప్రమాణ స్వీకారం చేశారు. షిల్లాంగ్లోని రాజ్భవన్లో మంగళవారంనాడు జరిగిన కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి జేపీ నడ్డా తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఎన్సీపీ చీఫ్ కాన్రాడ్ సంగ్మా ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం వరుసగా ఇది రెండోసారి. ఎన్పీసీ సారథ్యంలోని మేఘాలయ ప్రభుత్వంలో సంగ్మాతో పాటు అలెగ్జాండర్ లలూ హెక్, డాక్టర్ అంపరీన్ లింగ్డో, పాల్ లింగ్డో, కమింగోన్ యంబోన్, షక్లర్ వార్గర్, అబు తహెర్ మోండల్, కిరమేన్ షాయలా, ఎంఎన్ మారక్, రక్కమ్ ఎ సంగ్మా మంత్రులుగా, ప్రెస్టోన్ త్సాంసాంగ్, ఎస్.ధర్లు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్పీపీ కూటమి 45 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకు ముందుగు వచ్చింది. కాన్రాడ్ కె సంగ్మా సారథ్యంలోని ఎన్పీపీ 26 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 2 సీట్లు గెలుచుకుంది.
తాజావార్తలు
-
Team India: టీమిండియాలో కీలక మార్పులకు శ్రీకారం.. అప్పుడే ఒక వికెట్ డౌన్!
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
-
PM Modi: “నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం’.. కఠిన శిక్ష తప్పదు”.. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?