NTV Telugu Site icon

Nedurumalli Ramkumar Reddy : విద్యను ఆస్తిగా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్

Ramkumar Reddy

Ramkumar Reddy

ఐదవ విడత వైఎస్సార్‌ నేతన్న నేస్తం నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు సీఎం జగన్‌. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయ కర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట ఇచ్చారు అంటే నిల బెట్టుకుంటారని ఆయన అన్నారు. విద్యను ఆయుధంగా చేసుకోమని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పిలుపునిస్తే, విద్యను ఆస్తిగా ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

Also Read : Sangareddy: కనువిందు చేసిన జింకలు.. పచ్చిక బయళ్ల మధ్య విన్యాసాలు

రాజకీయంగా మూలన పడిన నాయకుడికి వెంకటగిరి టికెట్ ఇస్తే ప్రజలు గెలిపించారని, ఆయన పార్టీ ని మోసం చేశాడు ఇటీవల టిడిపి యువనేత ఏడు రోజులు పాటు విహార యాత్ర చేశాడు, ఏడు మంది కూడా టీడీపీలో చేరలేదన్నారు. 80 వేల ఎకరాలు నీరు అందించే డక్కలి మండలం లోని అల్తూరు పాడు రిజర్వాయర్ పనులను ఆయన అడ్డుకున్నాడని, ఈ జలాశయ పనుల ను వెంటనే ప్రారంభించాలని సీఎం గారిని కోరుతున్నానన్నారు. వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని, వెంకటగిరి లో బీసీ కమ్యూనిటీ హాల్.. కలవాయి లో ఎస్సీ గురుకుల పాఠశాల నిర్మాణం చేయాలన్నారు రామ్‌ కుమార్‌ రెడ్డి. వెంకటగిరి పోలేరమ్మ జాతర ను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించాలి ఆయన అన్నారు.

Also Read : Sangareddy: కనువిందు చేసిన జింకలు.. పచ్చిక బయళ్ల మధ్య విన్యాసాలు